తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు షరతులతో కూడిన సాధారణ బెయిల్ నే సుప్రీంకోర్టు మంజూరు చేసిందని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి చెప్పారు. అందుకనే తానూ బెయిల్ పై ఎలాంటి అభ్యంతరం చెప్పలేదన్నారు. కోర్టు జయలలితకు బెయిల్ మంజూరు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో జయ తరపున ఫాలీ నారిమన్ వాదనలు వినిపించారని తెలిపారు. జయకు, ఆమె సహచరులకు విధించిన శిక్షను సస్పెండ్ చేయాలా? వద్దా? అనే విషయంపై కోర్టు ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. దాదాపు 35వేల పత్రాలను డిసెంబర్ 18లోగా కర్ణాటక హైకోర్టుకు సమర్పించాలని, అలా చేయకపోతే జయలలిత బెయిల్ రద్దవుతుందని స్వామి వివరించారు.
బెయిల్ కూడా ఆ తేదీ వరకే అమల్లో ఉంటుందన్నారు. ఆ తర్వాత ఆమెకు బెయిల్ పై కర్ణాటక హైకోర్టు నిర్ణయం తీసుకోవచ్చని సుబ్రమణ్యస్వామి తెలిపారు. అంతేగాక, కర్ణాటక హైకోర్టు విచారణపై ఎలాంటి వాయిదా కోరకూడదన్నారు. జయలలిత వయస్సు, అనారోగ్య కారణాల వల్లే అత్యున్నత న్యాయాస్థానం బెయిల్ మంజూరు చేసిందని తెలిపారు. ఢిసెంబర్ 18 వరకు ఆమె ఇంట్లోనే ఉండాలని, ఈ సమయంలో ఎవరితోనూ సంప్రదించడం కానీ, కలవడం కానీ చేయరాదని కోర్టు షరతులు విధించినట్లు ఆయన వెల్లడించారు.
అటు, బెయిల్ ఇచ్చాక తమిళనాడులో ఎలాంటి హింస జరగబోదని, జడ్జిల గురించిగానీ, వేరెవరిగురించి గానీ వ్యాఖ్యలు చేయబోరని నారిమన్ కోర్టుకు హామీ ఇచ్చినట్లు స్వామి పేర్కొన్నారు. ఎలాంటి హింసాత్మక ఘటన జరిగినా, తనపై దాడి జరిగిందని సుబ్రహ్మణ్య స్వామి చెప్పినా వెంటనే బెయిల్ రద్దవుతుందని కోర్టు చెప్పిందని సుబ్రహ్మణ్య స్వామి వివరించారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more