దెయ్యాలు ఉన్నాయా లేవా అనే విషయం ప్రపంచ వేదికపై చర్చకు వచ్చినప్పుడల్లా ప్రస్తావించేది ఇంగ్లాండ్ లోని డూడ్లే కోట గురించి. ఈ కోటలో దెయ్యాలు ఉన్నాయని ఎప్పటినుంచో తెగ ప్రచారం జరుగుతోంది. చాలామంది ఈ కోటలో దెయ్యాలను చూశామని గతంలో చెప్పారు. తాజాగా అయితే ఓ జంట తాము దెయ్యాన్ని ఫొటో తీశాము అని సంచలనం సృష్టించింది. కావాలంటే ఇదిగో ఫొటో చూడండి అని అందరికి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోపై ఇంగ్లాండ్ లో తెగ చర్చలు జరుగుతున్నాయి. ఫొటోలో ఉన్నది నిజం దెయ్యమా.. లేక కల్పనా అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
బ్రిటన్ పత్రికల కధనాల ప్రకారం.., ఈ మద్య కోటను సందర్శించిన డీన్, ఏమి హార్బర్ అనే దంపతులకు దెయ్యం కన్పించిందట. బూడిదరంగు బట్టలు వేసుకుని ఉండటంతో పాటు చేతికి వాచి కూడా ధరించిందని చెప్తున్నాయి. దెయ్యం కన్పించగానే.., వెంటనే వారు ఫొటో తీశారట. ఈ ఫొటో బయటకు రావటంతో దెయ్యాలపై మళ్లీ చర్చ మొదలయింది. కోరికలు తీరని వారు దెయ్యాలుగా ఆత్మలై తిరుగుతారని అంతా అనుకుంటారు. కాబట్టి చనిపోయిన తర్వాత దెయ్యాలు తమ కోరికలను తీర్చుకుంటాయని కొందరు చెప్తున్నారు. అయితే దెయ్యాలు బట్టలు వేసుకోవాల్సిన అవసరం ఏమిటి..., అంతేకాకుండా వాచీ ఎందుకు పెట్టుకుంటాయి అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.
కోట కధ ఇదీ...
ఇంగ్లాండ్ లో ఎంతో ప్రాచుర్యం పొందిన డూడ్లె కోట 1071సంవ్తసరంలో నిర్మించబడింది. అప్పట్లో ఇందులో బెమెంట్ అనే రాణి నివాసం ఉండేది. ఆమె ప్రసవం సమయంలో ఆరోగ్యం విషమించి రెండు కోరికలు కోరింది. అందులో ఒకటి తనతో పాటు బిడ్డ చనిపోతే ఇద్దర్నీ ఒకే సమాధిోల పాతి పెట్టాలి. రెండవది తన అంత్యక్రియలకు భర్త హాజరు కావాలని కోరింది. భగవంతుడు కరుణించకపోవటంతో తల్లి, బిడ్డా ఇద్దరూ చనిపోయారు. కాని ఆమె కోరిన రెండు కోరికలు నెరవేరలేదు. అందువల్లే ఆమె దెయ్యంగా మారి ప్రతికారం తీర్చుకుంటుంది అని స్థానికంగా కథ ప్రజల నోట విన్పిస్తుంది.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more