ఆలస్యంగా రావడమే కాకుండా, రెండు గంటలుగా తన కోసం పడిగాపులు కాస్తున్న మంత్రులను కాదని సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ....నేరుగా శంకుస్థాపనలకు వెళ్లిపోవటంతో బాలయ్యా...మజాకా...అనుకకోవటం అధికారులు, కార్యకర్తల వంతైంది. హిందుపురం పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసేందుకు అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణకు సమాచారం అందించారు. నిర్ధేశిత సమయానికి రావాల్సిన బాలయ్య.. రెండు గంటలు అలస్యంగా వచ్చారు. అప్పటికే రెండు గంటల నుంచి బాలయ్య కోసం జాతీయ రహదారిపై మంత్రులు కామినేని శ్రీనివాస్, పల్లె రఘునాథ్ రెడ్డితో పాటు హెల్త్ కమిషనర్ సౌరభ్ గౌర్, ఆర్డీవో, డీఆర్డీఏ పీడీ తదితరులు ఎదురు చూశారు.
షెడ్యూల్ కన్నా రెండు గంటలు ఆలస్యంగా వచ్చిన బాలయ్య ....మంత్రులను పట్టించుకోకుండానే కొట్నూరులో పాఠశాల భవనాల భూమిపూజ కార్యక్రమానికి వెళ్లిపోయారు. మంత్రులు అధికారులు ఎక్కడున్నారన్న సమాచారం సరిగ్గా అందుకోని బాలయ్య, నేరుగా తన షెడ్యూలు కార్యక్రమాలలో నిమగ్నమయ్యారు. ఇంకేముంది సమాచారం అందుకున్న మంత్రులు, అధికారులు బాలయ్య వున్న చోటికి పరుగులు తీశారు.. ముఖ్యమంత్రి గారి వియ్యంకుడా మజాకా..? అంటూ సరదాగా వ్యాఖ్యానించిన మంత్రులు, అధికారులు అనంతరం ప్రభుత్వాస్పత్రి సందర్శన సందర్భంగా బాలయ్యను పొగడ్తలతో ముందెత్తారు.
ఆ తరువాత సూరప్పగుంట ప్రాంతంలో సమ్మర్ స్టోరేజ్, ఉద్యానవనం ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న స్థలాన్ని బాలయ్య పరిశీలించారు. అన్యాక్రాంతానికి గురైన ప్రాంతాలపై కలెక్టర్, స్థానిక అధికారులతో చర్చించిన బాలయ్య.. సదరు స్థలాన్ని విక్రయించిన వారితో పాటు కొనుగోలుదారులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఒకేరోజు 11 కార్యక్రమాలను రూపొందించటం, బాలయ్య రెండు గంటలు ఆలస్యంగా రావటంతో కార్యక్రమాలన్నీ హడావిడి మధ్య సాగినా.. అన్ని సక్రమంగానే పూర్తయ్యాయి. బాలయ్యను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో రావడంతో పోలీసులు వారిని అదుపు చేశారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more