ఆర్టీసీలో సమ్మె జరుగుతుందని ఊహించుకుని ఆందోళనలో ఉన్న ప్రయాణికులకు ఊరట. గురువారం నుంచి తలపెట్టిన సమ్మె పిలుపును కార్మికులు వెనక్కి తీసుకున్నారు. సంస్థ యాజమాన్యంతో జరిపిన చర్చలు సఫలం కావటంతో సమ్మె చేయటం లేదని ఎంప్లాయిస్ యూనియ్ ప్రకటించింది. తమ సమస్యల పరిష్కారానికి యాజమాన్యం అంగీకరించినట్లు కార్మిక నేతలు తెలిపారు. అపరిష్ర్కుత డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఈయూ సమ్మెకు పిలుపునివ్వగా.., బుధవారం మధ్యాహ్నం పలు దఫాలుగా యాజమాన్యం వారితో చర్చలు జరిపింది.
ప్రధాన సమస్యలపై నిర్ణీత గడువు లోగా పరిష్కరిస్తామని చర్చల్లో యాజమాన్యం హామి ఇచ్చింది. అంతేకాకుండా కార్మికుల సొసైటీ, డీఎ బకాయిల చెల్లింపుకు సంస్థ యాజమాన్యం అంగీకరించింది. అదేవిధంగా పండగ అడ్వాన్సులు చెల్లించేందుకు కూడా అంగీకరించింది. ప్రధాన డిమాండ్లు పరిష్కారం కావటంతో సమ్మె పిలుపును ఉపసంహరించుకున్నట్లు ఈయూ నేతలు స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని బస్ భవన్ లో జరిగిన ఈ చర్చల్లో ఆర్టీసీ ఉన్నతాధికారులతో పాటు ఈయూ ప్రధాన నేతలు పాల్గొన్నారు.
1958లో ప్రారంభమైన రాష్ర్ట రోడ్డు రవాణా సంస్థ దేశంలోనే అత్యుత్తమ ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థగా గుర్తింపు పొందింది. సామాన్యుడు వెళ్లే పల్లె వెలుగు బస్సులు మొదలుకుని విలాసవంతమైన సౌకర్యాలుండే వెన్నెల, గరుడ ప్లస్ బస్సులను కూడా సంస్థ నడుపుతోంది. కేవలం రాష్ర్టంలోనే కాకుండా ఇతర రాష్ర్టాలకు కూడా సర్వీసులు నడుపుతూ ప్రయాణికులను చేరవేస్తుంది. అయితే సేవలకు తగిన ఆదాయం లేకపోవటంతో ఆర్టీసీ నష్టాల్లో ఉంది. ప్రభుత్వ సాయం పొందుతూ కార్పోరేషన్ గా ఆర్టీసి కొనసాగుతోంది. విభజన నేపథ్యంలో సంస్థలోనూ విభజన తప్పలేదు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more