తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మరోసారి వివాదానికి తెరతీశారు. ఎంపీ కావటంతోనే కాశ్మిరీ సమస్యను కదిపి కుదిపేసిన కవిత.., ఇప్పుడు హైదరాబాద్ అంశంతో హడలెత్తిస్తున్నారు. విభజన సమయంలో వివాదాలకు కేంద్రబిందువైన హైదరాబాద్ ను మరోసారి తగువుకు తీసుకొచ్చారు. విభజన బిల్లులో హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి కొత్త అర్ధాలు చెప్తున్నారు. సీమాంధ్రులకు అధికారాలా అంటూ నోరెళ్ళబెడుతున్నారు.
జాయింట్ కాదు కామన్
సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో కవిత ప్రసంగించారు. హైదరాబాద్ పై సీమాంధ్రులకు ఎలాంటి అధికారాలు ఉండవన్నారు. ఇది తాను చెప్తున్నది కాదనీ.. తెలంగాణ బిల్లే ప్రకటిస్తోందన్నారు. ‘‘హైదరాబాద్ కామన్ క్యాపిటల్ తప్ప జాయింట్ క్యాపిటల్ కాద’’న్నారు. కాబట్టి కామన్ క్యాపిటల్ లో పక్క రాష్ర్టమైన ఆంధ్రప్రదేశ్ కు హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగి కూడా స్పెషల్ ఇంక్రిమెంట్ పొందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెద్దామన్నారు. జూన్ రెండు తర్వాత ఉద్యమాలకు విరామం ఉంటుంది అనుకుంటే తెలంగాణలో ఆ పరిస్థితి లేదన్నారు. హైదరాబాద్; విద్యుత్, పోలవరం, ఉద్యోగుల విభజన, గవర్నర్ గిరీ ఇలా ప్రతి అంశంపై పోరాటం చేయాల్సి వస్తోందన్నారు.
తెలంగాణ జాగృతి ఉద్యమ సంస్థ నాయకురాలి స్థాయి నుంచి ఎంపీ అయిన తర్వాత కవిత తరుచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తోంది. ఎంపిగా తొలిరోజుల్లోనే కాశ్మీర్, హైదరాబాద్ భారత దేశంలో భాగాలు కాదంటూ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. బాద్యత తెలుసుకుని మాట్లాడాలని అన్ని వర్గాలు చివాట్లు పెట్టాయి. ఆ తర్వాత ఇదే కాశ్మిర్ లో పండితుల అంశంపై పార్లమెంట్లో ప్రసంగించి ప్రశంసలు అందుకున్నారు. ఇక ఇప్పుడు హైదరాబాద్ హక్కులపై నోరు మెదిపారు. మరి ఈ సారి ఏమవుతుందో చూడాలి.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more