(Image source from: former mla jagga reddy apologise to congress)
కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి తనకు మెదక్ ఎంపీ టికెట్ లభించనందున బీజేపీ పార్టీ నుంచి జగ్గారెడ్డి తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే! అయితే ఆయన ఎప్పుడు పార్టీ జంప్ అయ్యారనే విషయం ఎవ్వరికీ అర్థం కాలేదు. ఆ స్థానం నుంచి బీజేపీ తరఫు నుంచి ఇంకొకరు పోటీ చేస్తున్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో హఠాత్తుగా ఈయన వచ్చి చేరిపోయారు. దీంతో ఈ విషయం వెనుక పవన్కల్యాణ్ హస్తం వుందనే ప్రచారాలు కూడా జోరుగా సాగిపోయాయి. ఈ విషయాలన్నీ పక్కనపెడితే.. తాజాగా జగ్గారెడ్డి బీజేపీ పార్టీలో చేరినందుకు క్షమాపణలు చెప్పుకుంటున్నారు.
అయితే ఆయన క్షమాపణలు చెబుతున్నది ఎందుకనుకుంటున్నారా..? సాధారణంగా ఒక పార్టీ నుంచి మరోపార్టీలోకి చేరేముందు చర్చలు జరుపుతారు. కానీ జగ్గారెడ్డి విషయంలో అలా జరగలేదు. దీంతో ఆయన ముందుగా చెప్పకుండానే పార్టీ మారడంతో కాంగ్రెస్ పార్టీకి క్షమాపణలు చెప్పుకున్నారు. పట్టణంలోని పీఎస్ఆర్ గార్డెన్ ఏర్పాటు చేసిన టీజేఆర్ యువసే, కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న జగ్గారెడ్డి.. తాను ముందుగా ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే బీజేపీ పార్టీలోకి చేరినందుకు క్షమించాల్సిందిగా కాంగ్రెస్ కార్యకర్తలతో వేడుకున్నారు.
‘‘పార్టీ మారే విషయంపై మీతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి వున్నప్పటికీ.. అంత సమయం లేకపోవడంతో చెప్పలేకపోయా! కాబట్టి మీరంతా పెద్ద మనస్సుతో నన్ను క్షమిస్తారని కోరుకుంటున్నాను. కాంగ్రెస్ తరఫున టికెట్ రాకపోవడంతో బీజేపీ నాయకులు నన్ను ఆహ్వానించి పోటీచేయమన్నారు. అందువల్లే నేను ఆ పార్టీలోకి చేరాను. కేవలం అభివృద్ధి చేయడం కోసం మాత్రమే పార్టీ మారాను.. అంతేకాని సీటు కోసం ఆశపడలేదు’’ అంటూ జగ్గారెడ్డి పేర్కొన్నారు. దీనికి తన మిత్రులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు అందరూ సహకరించాలని ఆయన కోరారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more