ప్రస్తుత యాంత్రిక యుగంలో మనిషిని నడుపుతోంది కరెన్సి. ఏ పనికావాలన్నా.., ఏం చేయాలన్నా డబ్బు తప్పనిసరి. ఒకప్పుడు అవసరం అయిన డబ్బు ఇప్పుడు తప్పనిసరైంది. ఎలా సంపాదించారనే దానికంటే ఎంత సంపాదించారు అనేది అంతా చూస్తున్నారు. కోట్లు కూడబెట్టినా నోట్లపై ఉన్న మక్కువ పోదు మనిషికి. అదేమంటే అదంతే. డబ్బే వ్యక్తి బలము.., బలహీనత. అందుకే ధనమేరా అన్నిటికీ మూలం అప్పట్లోనే గొప్పగా పాట రాశారు మన తెలుగు రచయితలు. ధనం మూలం ఇదం జగత్ అని చెప్పారు కవులు. ఇంతటి ప్రాముఖ్యం ఉంది డబ్బుకు. మరి ఆ కరెన్సీ కాగితంపై ఉండే బొమ్మలు కూడా అంతే ప్రాముఖ్యం కలిగినవి ఉండాలంటున్నారు రిజర్వు బ్యాంకు గవర్నర్.
గాంధీ ఫొటో మాత్రమే కావాలి
భారతీయ కరెన్సి నోటుపై మనకు కన్పించేది మహాత్ముడి ఫొటో. మరి ఆయనతో పాటు ఇంకెవరైనా ఉంటే కూడా బాగుండు అని మీకు అన్పించిందా. మీ సంగతి అటుంచితే ఇప్పటికే చాలా మంది తమ అభిమాన నేతల ఫొటోలను నోట్లపై ముద్రించాలని పలు సందర్బాల్లో మాట బయట పెట్టారు. అన్నట్లు మన దేశంలో మహనీయులకు కొదువ లేదు. నాయకులకు లెక్కే లేదు. ప్రతి ఒక్కరూ లీడరే. నీకు నువ్వే రాజురా నిన్ను ఆపేది ఎవడురా అన్నట్లు.., ఎవరికి వారు లీడరే. ఇదే అసలు వారికి ఎసరు పెడుతోంది. చాలామంది గొప్పవారి ఫొటోలను కరెన్సి నోట్లపై ముద్రించాలని ప్రతిపాదనలు వచ్చాయి. వీటిపై రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్ స్పందించారు. మన దేశ కరెన్సీ నోట్లపై గాంధీ గారు తప్ప మరెవరి ఫొటోలు ముద్రించవద్దని స్పష్టం చేశారు. దేశంలో చాలా మంది మహనీయులున్నారు.., కాదనటం లేదు. అయితే అందరికంటే మహోన్నతుడు మహాత్మాగాంధీ అని కొనియాడారు.
గాంధీ కాకుండా లేక, గాంధీతో పాటు దేశంలో ఉన్న గొప్పవారిలో ఎవరి చిత్రాన్ని ముద్రించినా దానిపై వివాదాలు జరగటం ఖాయమన్నారు. ఎందుకంటే మిగతావారంతా ప్రధానంగా రాజకీయ పార్టీలకు చెందినవారే ఉన్నారు. కాబట్టి ఒక వర్గం అంగీకరిస్తే మరొక వర్గం వ్యతిరేకించి అనవసర దుమారం రేగుతుందని చెప్పారు. ఇది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే కాదని.., అందరి విలువలు కాపాడటంతో పాటు భారతీయత, ఇక్కడి నేతలకు ఉన్న గౌరవాన్ని పెంపొందించేందుకు ఇలా మాట్లడుతున్నట్లు సమాధానం ఇచ్చారు.
ఇందుకు ఓ ఉదాహరణ కూడా ఇచ్చారు రాజన్. దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నకు సచిన్ ఎంపిక కావటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయిన విషయాన్ని గుర్తు చేశారు. ఇది వాస్తవమే సచిన్ కు భారతరత్న ఇవ్వటంపై కొద్ది రోజుల పాటు వివాదం నడిచింది. కోర్టుల దాకా కూడా ఈ అంశం వెళ్ళింది. టెండుల్కర్ కంటే ముందు ప్రజలకు, దేశానికి సేవ చేసిన వారు చాలామంది ఉన్నారని వారందర్నీ వదిలి పెట్టి ఆయనకు ఇవ్వటం ఏంటని కొందరు గొడవ చేశారు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more