కాంగ్రెస్ ప్రభుత్వం లో.. పేదవాడికి 600 వంద రూపాయలు ఉంటే చాలు నెల మొత్తం బతికేయవచ్చునని కాంగ్రెస్ పార్టీ సినియర్ నేత చెప్పటం జరిగింది. ఇప్పుడు మాత్రం పేదవాడికి 33 రూపాయలు సంపాదిస్తే చాలు కోటీశ్వర్లు అయిపోయినట్టే. పేదవారితో ప్రతి రాజకీయనాయకుడికి చులకనగా మాట్లాడటం అలవాటు అయ్యింది. రూపాయికి విలువ లేని రోజులు ఇవి. డాలర్ మన రూపాయిపై పెత్తనం చేస్తున్న రోజులు. అలాంటి కేవలం 33 రూపాయాలతో పేదవాడు ఎలా బతుకుతాడు.
నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కేజీ బియ్యం ధర 30 రూపాయలు దాటిపోయింది. ప్రభుత్వం పథకం కింద అందించే నీరు కూడా 2 రూపాయలైపోయింది. అలాంటి పరిస్థితుల్లో కూడా గ్రామాల్లో రోజుకు 33 రూపాయలు, నగరాల్లో 47 రూపాయలు ఖర్చు పెట్టేవారంతా ధనికులేనని కేంద్రానికి నిపుణుల కమిటీ ఒకటి సూచించింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఇది పెను దుమారమే లేపింది.
అధికార, విపక్ష నేతలంగా నిపుణుల నివేదికపై అభ్యంతరం చెబుతున్నారు. సాక్షాత్తూ కేంద్ర మంత్రులే దీనిపై మండిపడుతున్నారు. రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్, ప్రముఖ ఆర్థిక వేత్త రంగరాజన్ నేతృత్వంలోని కమిటీ ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరు పేదవారే అని స్పష్టం చేయగా, ఈ కమిటీ రోజుకి 33 రూపాయలు ఖర్చు చేస్తే పేదలుకాదని తేల్చింది.
ఈ లెక్కన పేదలు కానివారంతా ఆహారానికి, విద్యకు, ఆరోగ్యానికి తగినంత సంపద కలిగి ఉన్నారని నిపుణులు కమిటీ స్పష్టం చేస్తోంది. దీనిపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రంగరాజన్ కమిటీ రోజుకు 100 రూపాయలు ఇచ్చి ఎలా బతకాలో నేర్పాలని నిపుణుల కమిటీని ప్రశ్నించిందని విపక్షాలు గుర్తు చేస్తున్నాయి.
సీపీఎం సీనియర్ నాయకుడు సీతారాం ఏచూరి, సమాజ్ వాదీ పార్టీ నాయకుడు నరేష్ అగర్వాల్ కూడా ఈ లెక్కలను ఖండించారు. రంగరాజన్ కు తాము రోజుకు వంద రూపాయలు ఇచ్చి, పల్లెలో ఎలా బతకాలో చూపించమంటామని అగర్వాల్ అన్నారు.
RS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more