Mla srikanth reddy talks to media after governor speech in ap assembly

MLA Srikanth Reddy talks to media, ysrcp MLA Srikanth Reddy talks to media, MLA Srikanth Reddy fire on governor speech, andhrapradesh assembly.

MLA Srikanth Reddy talks to media after Governor Speech in AP Assembly

ఏదో ఆశించాం..! కానీ తుస్సున పోయింది?

Posted: 06/21/2014 01:13 PM IST
Mla srikanth reddy talks to media after governor speech in ap assembly

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ..ఏదో ఆశించారు.. కానీ వారికి అది అందలేదు. దీంతో వైసీపి ఎమ్మెల్యే పాలెం శ్రీకాంత్ రెడ్డి .. మీడియా ముందు తమ గోడు వెల్లబోసుకున్నారు. ఈరోజు ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ ప్రారంభమైన తరువాత ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగం పై వైసీపీ నేతలు అసృంతప్తి వ్యక్తం చేశారు.

ఏదో అనుకొని అసెంబ్లీలో అడుగు పెడితే.. గవర్నర్ ప్రసంగంతో ఉన్నది మొత్తం కారిపోయిందని శ్రీకాంత్ రెడ్డి వ్యంగంగా అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళన చెందుతున్నారని, కొందరు రైతులకు నోటీసులు కూడా వచ్చాయని పేర్కొన్నారు. వీరికి మనోధైర్యం చెప్పే విధంగా గవర్నర్ ప్రసంగంలో ఉంటుందని ఆశించామని కానీ అలాంటిదేమి లేదన్నారు. అలాగే నిరుద్యోగులు, చేనేత కార్మికుల సమస్యలపై ఏమీ చెప్పలేదని విమర్శించారు.

వైఎస్ ముఖ్యమంత్రి పాలన మొత్తం స్వర్ణయుగంలా సాగిందని తెలిపారు. 2004 నుండి అభివృద్ధి కుంటుపడిందని బాబు అంటున్నారు. అది నిజమే. వైఎస్ మృతి తరువాత సరైన రీతిలో పాలన సాగలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. విభజన మమ్మల్ని బాధించిందని చెబుతున్నారు..రాష్ట్ర విభజనకు కారకులెవరో గవర్నర్ కు బాగా తెలుసు. ఆ పేర్లు కూడా చెబితే బాగుంటుందని వైసీపీ నేతలు డిమాండ్ చేయటం జరిగింది.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles