మీకు పన్ను రాయితీ కావాలంటే.. వెంటనే.. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడ్ని కలవండి? తప్పకుండా మీకు పన్ను మినహాయింపు లభిస్తుంది. కానీ షరతులు వర్తిస్తాయి. తమిళనాడు జయమ్మ, పశ్చిమ బెంగాల్ మమతమ్మల బాటలో.. చంద్రబాబు అడుగులు వేస్తున్నారు.
ఈ ఇంటికి మా పార్టీ జెండ రంగు వేసుకుంటే చాలు..మీకు అన్ని రాయితీలు లభిస్తాయని మమతా బెనర్జీ . మీకు ఇంటిల్లో నా ఉప్పునే వాడండి? మీకు అంత మంచే జరుగుతుందని తమిళనాడు జయమ్మ, తమ రాష్ట్ర ప్రజకలు బంఫర్ ఆఫర్ ఇవ్వటం జరిగింది. ఇప్పుడు వారి బాటలోనే.. మన చంద్రాలు సారు, ఆంద్రప్రదేశ్ ప్రజలకు చక్కని బంఫర్ ఇవ్వటం జరిగింది.
రాష్ట్ర విభజనతో రాజధాని రాజ్యంగా లో హైటెక్ రాజుగా చంద్రబాబు నాయుడు ఎన్నికైన విషయం తెలిసిందే. ఆయన తమ రాజధాని నిర్మించుకోవటానికి.. రాత్రి, పగలు అనే తేడా లేకుండా, చందమామ కలలు కంటూ, చిన్న, పెద్ద అని భేదం లేకుండా.. సీమాంద్ర ప్రజలకు బంఫర్ ఆఫర్ ఇవ్వటం జరిగింది. రాజధానిని కోల్పోయిన అవశేష ఆంద్రప్రదేశ్ ను పునాది నుంచి నిర్మించుకనేందుకు ప్రజలు తప్పక సహకరించాలని కోరటం జరిగింది.
ఎపిస్టేట్ న్యూ కేపిటల్ కోసం అందే విరాళాలకు నూరు శాతం పన్ను మినహాయింపు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చంద్రబాబు చెప్పారు. ఎపిస్టేట్ న్యూ కేపిటల్ డెవలప్మెంట్ ఫండ్ లేదా సిఎం రిలీఫ్ ఫండ్ పేరిట విరాళాలు పంపవచ్చని ఆయన తెలిపారు. రాజధాని నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశిస్తున్నారని, హైదరాబాద్ను మించి అన్ని హంగులతో నూతన రాజధాని నిర్మాణం జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.
అసలే అన్నం లేక ..అల్లో రామచంద్ర అని ఏడుస్తుంటే, తెల్ల చొక్క కావాలని గోల చేసాడట? అనే విధంగా చంద్రబాబు ఆలోచన ఉందని అంటున్నారు. రాష్ట్రం విడిపోయిన తరువాత.. కేంద్రం సీమాంద్రా కొన్ని రాయితీలు ఇస్తుంది. మనకు ఆదాయం లేదని తెలుసు, విరాళాలు అయితే.. ఏదో తులమో, ఫలమో దాచిపెట్టుకున్న పైసల్ ఇస్తాం. కానీ 100 శాతం పన్ను రాయితీ తగ్గించుకొని సంపాదన ..సీమాంద్ర ప్రజలు సంపాదించుకోవాలి కదా. అసలు సంపాదనే లేనప్పుడు.. ఇక పన్నులు ఎలా కడతారు.
అయినా రాజధాని మీద ఇష్టపడి, మనసుపడి, విరాళం ఇస్తారు గానీ, ఇలా 100 శాతం రాయితీ కోసం ఆశపడి విరాళం ఇస్తే , అది స్వార్థం అవుతుంది. రాజధాని కోసం విరాళం అడగటంలో తప్పులేదు. ఇలా ప్రజల మనోభావాలు దెబ్బ తినే విధంగా.. ఆఫర్ ఇచ్చి అడిగితే. పాత కష్టాలు మళ్లీ పార్టీ తలుపులను తడతాయి. సీమాంద్ర ప్రజలు మనసున్న మహానుభావులు .. మనది అనుకుంటే చాలు.. రాజధాని కోసం నిలుపు దోపిడి ఇచ్చే పుణ్యమూర్తులు చాలా మంది ఉన్నారు. బాబు గారు ఆఫర్లు ఇచ్చి విరాళలు అడిగి.. ఆంద్ర ప్రజల మనసులను గాయం చేయద్దని టిడిపి కార్యకర్తలు, తెలుగు ప్రజలు కోరుతున్నారు.
RS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more