తెలంగాణా విడిపోయిన తర్వాత మిగిలిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాను ఖరారు చేస్తూ ఉత్తర్వులిచ్చింది.
ఈ ప్రత్యేక హోదా జూన్ 8 న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి 5 సంవత్సరాల కాలం వరకు అమలులో ఉంటుంది.
ఫిబ్రవరి 20 న అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ఇచ్చిన హామీ మేరకు మార్చి 1న కేంద్ర హోం శాఖ సంబంధిత నోట్ ని తయారు చెయ్యగా, యుపిఏ ప్రభుత్వంలో మార్చి 2 న కేంద్ర క్యాబినెట్ రాష్ట్ర విభజన తర్వాత మిగిలిన ఆంధ్ర ప్రదేశ్ కి ప్రత్యేక హోదాని ప్రకటించింది.
ఆ తర్వాత ఆ ఆదేశాలు ప్లానింగ్ కమిటీకి చేరింది. ఇంతలో ఎన్నికల నియమావళి అమలులోకి రాగా ప్లానింగ్ కమిషన్ దగ్గరే ఉత్తర్వులు నిలిచిపోయాయి. ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ పూర్తై తెలంగాణా రాష్ట ఆవిర్భావ ప్రకటన కూడా అయిపోవటంతో ఆ ఉత్తర్వులు తిరిగి ప్లానింగ్ కమిషన్ నుంచి వెలువడుతున్నాయి.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more