ఆల్ ఇండియా ద్రవిడ మున్నేత్ర కఝగమ్ (ఏఐడిఎమ్ కె) లక్ష్యం కాంగ్రెసేతర, భాజపేతర పార్టీల కలయికతో మూడవ ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పరచటమని మంగళవారం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అన్నారు. అందులో వివిధ రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలను కూడా కలుపుకు పోతారు.
వెల్లూరులో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ జయలలిత భాజపా మేనిఫెస్టో ప్రస్తావన తెస్తూ, ఇతర దేశాలలో వివక్షకు గురౌతున్న హిందువులకు రక్షణ కలిగిస్తామంటూ అందులో స్పష్టం చేసారని, అయితే విదేశాలలో ఉన్న భారతీయులలో కేవలం హిందువులే లేరని, అన్ని మతాలవారూ ఉన్నారని అన్నారు. అందువలన కేవలం విదేశాలలోని కేవలం హిందువులకే రక్షణ కల్పిస్తాననటం సెక్యూలరిజమ్ కాదని కూడా ఆమె అన్నారు.
మూడవ ప్రత్యామ్నాయం గురించి జయలలిత అన్న మాటలను సమర్థిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా, ఎన్నికల తర్వాత ఫెడరల్ గవర్నమెంట్ స్థాపన జరుగుతుందన్నారు. భవిష్యత్తులో ఫెడరల్ ప్రభుత్వం పనిచేస్తుందని ఆమె అన్నారు.
ఎఐడిఎమ్ కె అధికార ప్రతినిధి డా.నమధు ఎమ్ జి ఆర్ మాట్లాడుతూ తమిళనాడులో మోదీ హవా ఏమీ లేదని, కేవలం ప్రచారం కోసమే మోదీ ఎఐడిఎమ్ కె ని విమర్శించటం చేసారని, అభివృద్ధిని పోల్చి చెప్పటం కూడా ప్రచారంలో భాగమేనని అన్నారు. మోదీ రజనీకాంత్ ని కలవటం గురించి మాట్లాడుతూ అదంతా భాజపా అభ్యర్థుల డిపాజిట్ గల్లంతవకుండా ఉండటం కోసం చేసిన ఏర్పాట్లని అన్నారు.
మోదీ ఒకవేళ ప్రధానమంత్రైన పక్షంలో పశ్చిమ బెంగాల్ కి ఆర్థిక సహాయాన్ని పెంచుతారని మీరు అనుకుంటున్నారా అన్న ప్రశ్నకు మమతా బెనర్జీ మాట్లాడుతూ, మోదీ ప్రదానమంత్రి అవటమనేది అతిశయం తప్ప మరేమీ కాదని అని అంటూ, బెంగాల్ కి ముష్టి అడుక్కోవలసిన అవసరమేమీ లేదని అన్నారు. బెంగాల్ లోని అభివృద్ధిని, గుజరాత్ లోని అభివృద్ధిని పోల్చి చూసే విధానం సరిగ్గా లేదని కూడా మమత బెనర్జీ అన్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more