తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మంగళ వారం నాడు తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు మీద విరుచుకుపడ్డారు. ఆయన మాయల మరాఠీ అని, వసూల్ రాజా అని తూలనాడారు. తెదేపా ప్రభంజనం చూసి ఆయన గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయని, నిద్రలోనూ ఆయనకి తెదేపాయే గుర్తకొస్తుందని అన్నారు.
తెరాస, వైకాపా, కాంగ్రెస్ నేతలు తెదేపాలో చేరిన సందర్భంగా పై మాటలన్న చంద్రబాబు కెసిఆర్ గురించి మాట్లాడుతూ, సోనియా తల్లి వల్లనే తెలంగాణా వచ్చిందని కుటుంబ సభ్యులతో సహా ఆమెను కలిసివచ్చి హైద్రాబాద్ లో ఒంటెల మీద ఊరేగారు, ఇప్పుడేమో కాంగ్రెస్ మోసం చేసిందని చెప్తున్నారు అని ఎద్దేవా చేసారు. ఆయన మాటల మరాఠీ, నీతి, నిజాయితీ, విశ్వసనీయత లేని వ్యక్తి అని అన్నారు.
తెలంగాణాను, హైద్రాబాద్ ని అభివృద్ధి పరచి తానే కానీ కెసిఆర్ కానీ, కాంగ్రెస్ కానీ చెయ్యలేదని అన్నారు చంద్రబాబు. తెదేపా నుంచి కూడా బయటకు వెళ్తున్న వారి విషయంలో వాళ్ళంతా నాయకులే కానీ పార్టీ కార్యకర్తలు కారని అన్నారాయన. తెదేపా ఒక నాయకులను తయారు చేసే ఫాక్టరీ అని, ఎంతో మంది కాంగ్రెస్ నాయకులు తెదేపా నుంచి వెళ్ళినవారేనని, కెసిఆర్ కి కూడా తర్ఫీదు వచ్చింది తెదేపాలోనేనని చంద్రబాబు అన్నారు. అందువలన ఒక నాయకుడు బయటకు పోతే మరో వంద మంది నాయకులను తయారుచేసుకునే సత్తా తెలుగుదేశం పార్టీకుందని ఆయన అన్నారు.
కెసిఆర్ ఎకరాకు కోటి రూపాయల ఆదాయాన్ని గురించి మాట్లాడుతున్నారని, అదంతా అవినీతి పంటేనని కూడా చంద్రబాబు విమర్శించారు. తెలంగాణాలో ఏ మారు మూల గ్రామానికి పోయి అక్కడ సిమెంట్ రోడ్డుని అడిగితే తన పేరే చెప్తుందని అంటూ, కార్మిక శాఖా మంత్రి గా ఉన్నప్పుడు బీడీ కట్టల మీద కెసిఆర్ పుర్రె గుర్తు పెట్టిన విషయం కూడా ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more