మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తమ కొత్త పార్టీ పేరును ఈరోజు బయట పెట్టారు. తమ పార్టీ పేరును అందరినీ కలుపుకొని పోయేలా ‘జై సమైక్యాంద్ర ’ గా పెట్టామని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.
అయితే కిరన్ కుమార్ రెడ్డి కొత్త పార్టీలో కార్యవర్గం
అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి , పార్టీ వ్యవస్థాపక అద్యక్షులు చుండ్రు శ్రీహరిరావు, పార్టీ కార్యదర్శి జి.గంగాధర్, వ్యూహకర్త : లగడపాటి రాజగోపాల్ , పార్టీ ఉపాధ్యక్షులు, సాయిప్రతాప్, సబ్బం హరి, ఉండవల్లి, హర్షకుమార్ , శైలజానాద్, పితాని.
అయితే మా పార్టీ టిక్కెట్ కోసం ఇప్పటికే చాలా మంది దరఖాస్తులు చేసుకున్నారని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. అయితే పార్టీ విధానాలు, సిద్దాంతాలు గురించి రాజమండ్రిలో జరిగే సభలో వివరిస్తామని తెలిపారు.
రాష్ట్రంలో అందరు కలిసుండాలనే ఉద్యమం తెలంగాణ నుంచే వస్తుందని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలుగువారంతా కలిసి మెలిసి ఉండాలనేదే తమ పార్టీ ముఖ్య సిద్దాంతమన్నారు. ఇబ్బందులు వస్తే ప్రజలు కచ్చితంగా తిరగబడతారని తెలుసుకోవాలన్నారు. విభజన అనేది ప్రజల మేలుకోసమే జరగాలని పార్టీలు, నాయకుల కోసం రాష్ట్రం విభజన జరగకూడదని ఆయన అన్నారు. ఈ సందర్భంలో కిరణ్ కుమార్ రెడ్డి బెర్లిన్ గోడ ముక్కను విలేకరులకు చూపించారు. కలిసి ఉండాలనే బలమైన కాంక్షతోనే తూర్పు, పశ్చిమ, జర్మనీల మద్య ఉండే గోడను ప్రజలే బద్దలుగొట్టారని ఆయన గుర్తుచేశారు.
తెలంగాణ వచ్చాక కూడా రాజకీయ నాయకులు అసత్యాలే చెబుతున్నారని మండిపడ్డారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రసంగంలోని కొన్ని ముఖ్యాంశాలు..
* పార్టీ సీఎంగా ఉన్నప్పుడే అధిష్టానం మాట వినలేదు
* తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో కొత్త పార్టీ
* పార్టీని విభేదించే నేను బయటకు వచ్చా.
* రాష్ట్ర విభజనకు ముక్య కారకుడు చంద్రబాబే
* చంద్రబాబు తన అభిప్రాయాలను అసెంబ్లీలో కూడా చెప్పలేకపోయారు.
* తెలుగు ప్రజలకు కాంగ్రెస్, భాజపా కలిసి తీవ్ర ద్రోహం చేశాయి.
* పార్టీలో ఉన్నప్పుడే కాంగ్రెస్ పెద్దల మాట వినలేదు, లేనప్పుడు ఎలా వింటా?
* రాష్ట్ర విభజన ప్రక్రియలో కేంద్రప్రభుత్వం హోమ్ వర్క్ సరిగా చేయలేదు?
* బిల్లు పార్లమెంటు లో పెట్టిన తర్వాత రోజు సవరణులు పెట్టారంటే అర్థమేంటి?
* రాష్ట్ర విభజన వల్ల తెలంగాణ రైతులకు ఎంతో నష్టం కలుగుతుందని చెప్పా.
* తెలంగాణ వల్ల అందరికంటే ఎక్కువ నష్టం మహబూబా్ నగర్ జిల్లాకే అని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more