ముగ్గురు మాజీ మంత్రులు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలను కలుపుకుంటూ బలోపేతం చేసుకుంటున్న తెలుగుదేశం పార్టీ వలన కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం కలుగుతోందా అంటే, అది ఎప్పుడో జరిగిపోయింది, తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో దూకుడు వ్యవహారంలో వెళ్ళినప్పుడే కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రను కోల్పోయిందంటున్నారు కాంగ్రెస్ నాయకులు.
తెలుగుదేశంలో పార్టీలో చేరబోతున్న మంత్రులు టిజి వెంకటేష్, ఏరాసు ప్రతాపరెడ్డి, గంటా శ్రీనివాసరావులు. వీరిలో గంటా, భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్, గాజువాక ఎమ్మెల్య్ సి.వెంకట్రామయ్య, పెందుర్తి ఎమ్మెల్యే రమేష్ బాబు, కాకినాడ రూరల్ ఎమ్మల్యే కన్నబాబు మార్చి 8న విశాఖపట్నంలో జరగబోయే ప్రజాగర్జన సభలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. వీళ్ళంతా తొలుత ప్రజారాజ్యం పార్టీలో చేరి దరిమిలా కాంగ్రెస్ లోకి విలీనమైన నాయకులే.
మంత్రులు టి.జి వెంకటేష్, ఏరాసు ప్రతాపరెడ్డి, మాజీ మంత్రి మోహన్ రెడ్డి కర్నూల్ జరగబోయే ప్రజాగర్జనలో తెదేపాలో చేరబోతున్నారు.
కాంగ్రెస్ సీమాంధ్రకు అన్యాయం చేసిందని చెప్పటమే కాకుండా, పార్టీ మాత్రమే ముఖ్యం కాదని, దాని వెనకనుండి నడిపించే నాయకులే ముఖ్యమని, ప్రస్తుతంమున్న వారిలో చంద్రబాబు నాయుడుకున్న నాయకత్వ లక్షణాలు వేరెవరిలోనూ కనపడలేదని అన్నారు టిజి వెంకటేష్.
నెల్లూరు జిల్లాకి చెందిన అదాల ప్రభాకరరెడ్డి, శ్రీధర కృష్ణారెడ్డి, పోలమరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నెల్లూరులో మార్చి 5 నజరిగే ప్రజాగర్జన సభలో తెదేపాలో చేరటానికి నిశ్చయించుకున్నారు.
దీనితో ఎన్నికలలో పోటీచెయ్యటానికి తెదేపా శక్తి పుంజుకుంటున్నట్లుగానే కనిపిస్తోంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more