తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లో ఒక శిల్పి దాగి ఉన్నట్లు ఆ పార్టీ నేత సోమిరెడ్డి గుర్తించారు. ఈ రోజు ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో సీమాంద్ర తెలుగుదేశం పార్టీ నేతల సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా సొమి రెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. సీమాంద్రను తీర్చిదిద్దిన శిల్పి చంద్రబాబు నాయుడని చెప్పటం జరిగింది.
ఈ సమావేశంలో సోమిరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపిలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీతో బీజేపి నాయకులు కలిసిపోయి పెద్ద నాటకం పార్లమెంట్ , రాజ్యసభలో వేశారని సోమిరెడ్డి అన్నారు. పార్లమెంటుల్లో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టే సమయంలో .. బిజేపి నేత సుష్మాస్వరాజ్ వ్యవహరించిన తీరుపై సోమి రెడ్డి మండిపడ్డారు.
తెలంగాణ బిల్లు విషయం లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కి సుష్మాస్వరాజ్ ఎలా మద్దతు తెలిపిందో మాకు అర్థం కావటంలేదని ఆయన అన్నారు. గతంలో సోనియా గాంధీ పై విమర్శలు చేసిన సుష్మాస్వరాజ్ , కాంగ్రెస్ తో ఎలా కలిసిపోయారని సోమి రెడ్డి ప్రశ్నించారు.
తెలంగాణ బిల్లు పై పార్లమెంటులో ఆమోద ముద్ర పడిన వెంటనే సుష్మాస్వరాజ్ సభలో మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చినందుకు సోనియా పెద్దమ్మనే కాదు.. సుష్మాస్వరాజ్ చిన్నమ్మ ను కూడా గుర్తుపెట్టుకోవాలని ..తెలంగాణ నేతలను, తెలంగాణ ప్రజలను కోరిక విషయం తెలిసిందే.
అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ దేశానికి ప్రధానమంత్రి అయితే గుండు గీయించుకుంటానన్న సుష్మాస్వరాజ్, ఇప్పుడు సోనియాగాంధీని పెద్దమ్మగా ఎలా పోలుస్తారని సోమిరెడ్డి ప్రశ్నించారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై పార్లమెంట్లో ఎందుకు చర్చించలేదని ఆయన ప్రశ్నించారు.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more