అదిలాబాద్ జిల్లా మంచిర్యాల శాసన సభ్యుడు గడ్డం అరవింద రెడ్డి తెరాస ను వదిలి కాంగ్రెస్ పార్టీలోకి రావటానికి సిద్ధమయ్యారు.
తమకు పదవులు ముఖ్యం కాదని, తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావమే లక్ష్యంగా తమ పార్టీ ఏర్పడిందని, కాంగ్రెస్ పార్టీలో విలీనం చెయ్యటానికి సిద్ధమేనని ప్రకటించిన తెలంగాణా రాష్ట్ర సమితి, తీరా తెలంగాణా బిల్లుని రూపొందించి విభజన తతంగాన్ని ముందుకు నడుపుతున్నా, విలీనం విషయం గాలికి వదిలిన తెరాసను దెబ్బతీయాలంటే తెరాస లోంచి తమ పార్టీలోకి నాయకులను ఆహ్వానించటం ఒక మార్గమని అనుకున్న కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా పావులు కదపటం మొదలు పెట్టిందని దీనితో అర్థమౌతోంది.
తెరాస నాయకులను ఆకర్షించే ప్రయత్నం చెయ్యటం మొదలవగానే తెరాసలో భయం పట్టుకునే అవకాశం ఉందని కూడా కాంగ్రెస్ నమ్ముతోందని, అది కూడా కాంగ్రెస్ వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది. అన్ని సంవత్సరాలు ఉద్యమం సాగించి, తెలంగాణా వచ్చే సమయానికి తెరమరుగవటం తెరాసకు ఇష్టం లేదు. ఉద్యమం వలన వచ్చిన జనాదరణను లాభసాటిగా మలుచుకోదలచుకున్న తెరాస విలీనం విషయం దాటవేస్తోంది.
అంతే కాదు వచ్చే ఎన్నికలలో ఎవరితోనూ పొత్తు కూడా ఉండదని ఘంటాపథంగా చెప్తుంటే, రాజకీయంగా సీమాంధ్రను త్యాగం చేసిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణా కూడా దక్కకపోవటం బాధాకరమే. తాజాగా వచ్చిన సర్వే నివేదికల ప్రకారం చూసుకున్నా కాంగ్రెస్ పార్టీ మొత్తం రాష్ట్రం నుంచే ఊడ్చిపెట్టుకుని పోయే అవకాశం కనిపిస్తోంది. దాన్ని ఎదుర్కుంటూ కనీసం తెలంగాణా ప్రాంతాన్నైనా దక్కించుకోవటానికి కాంగ్రెస్ తెలంగాణా విజయయాత్రలు కూడా నిర్వహించింది. కానీ కాంగ్రెస్ నాయకులు అధిష్టానం తృప్తి మేరకు తెలంగాణాలో ప్రాబల్యాన్ని సంపాదించి పెట్టలేకపోయారు.
అరవిందరెడ్డితో పాటు ఇంకా కొంత మంది కాంగ్రెస్ పార్టీలోకి క్యూకట్టే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ ఆశిస్తోంది. అయితే, అరవిందరెడ్డి ఎలాగూ నిర్ణయించుకున్నాడు కాబట్టి ఆయనను, అంతకు ముందే వ్యతిరేకంగా వ్యవహరించిన విజయశాంతిని వదిలేసి మిగతావాళ్ళు పార్టీని వదిలి పోకుండా జాగ్రత్తలు తీసుకోవటం మొదలుపెడుతోంది తెరాస.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more