తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు తప్పించుకున్నాడు. ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలపై పోరాటం చేయాల్సిన చంద్రబాబు ఈరోజు అసెంబ్లీలోకి రాకుండా తప్పించుకున్నాడు. చంద్రబాబు బాటలోనే.. రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు అసెంబ్లీకి డుమ్మా కొట్టారు. అధికార పార్టీలో ఉండి, సమైక్యాంద్రకోసం పోరాటం చేస్తున్న నల్లారి కిరణ్ కమార్ రెడ్డి, సమన్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్న చంద్రబాబు ఒకేసారి అసెంబ్లీకి డుమ్మా కొట్టడం పై అనేక అనుమానాలకు దారీ తీస్తుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు-2013ను అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
అయితే విభజన బిల్లును ప్రవేశపెట్టే సమయంలో సీఎం కిరణ్ , ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇద్దరు లేరు. దీంతో అసెంబ్లీ కార్యదర్శి సదారాం ముసాయిదా బిల్లు అంశాల వివరాలను సభ్యులకు చదవి వినిపించారు. ఇప్పుడు అందరి నోట ఈ ఇద్దరి గురించే చర్చ జరుగుతుంది. ఈ ఇద్దరి అసెంబ్లీకి డుమ్మా కొట్టాడం పై సీమాంద్ర నేతలు , సీమాంద్ర ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. సీఎం కిరణ్, చంద్రబాబు నాయుడు కావాలేనే ఈరోజు అసెంబ్లీకి డుమ్మా కొట్టారని సీమాంద్ర నేతలు అంటున్నారు.
అయితే సీఎం కిరణ పై తెలంగాణ మంత్రలు మండిపడుతున్నారు. తెలంగాణ మంత్రులకు అపాయింట్ మెంట్ ఇచ్చిన సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత రద్దు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి ఉద్దేశపూర్వకంగానే చేశారని అపాయింట్ మెంట్ రద్దు చేశారని తెలంగాణ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more