తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ బాబు ఈ మద్య కాలంలో పొలిటికల్ నాయకుల మీద కామెంట్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో ట్విట్టర్ బాబు గా అందరికి పరిచయం అయ్యాడు. రీసెంట్ గా టిడిపి , టీఆర్ఎస్ నాయకుల మద్య మాటల యుద్దం జరుగుతుంది. చంద్రబాబు వర్సెస్ చంద్రశేఖరరావు అనే విధంగా రాజకీయ విమర్శల దాడి నడుస్తుంది. విషయంపైనైనా చర్చకు సిద్ధమని తమ పార్టీ అధినేత చంద్రబాబు సవాల్ విసిరినా టీఆర్ఎస్ నేత కేసీఆర్ ఇంకా ఫామ్ హౌస్లో పడుకునే ఉన్నారని లోకేష్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఏ రోజైనా కేసీఆర్ బయ్యారం గనులపై మాట్లాడారా అంటూ ప్రశ్నించటమే కాకుండా, ఉద్యోగుల కోసం కేసీఆర్ ఏనాడూ పోరాటం చేయలేదని విమర్శించారు. బాబ్లీ ప్రాజెక్ట్ నిర్మాణానికి వ్యతిరేకంగా కూడా కేసీఆర్ ఏనాడూ పోరాడలేదని లోకేష్ విమర్శలు చేశారు.
అయితే ఈరోజు రాజకీయ నాయకులు బాబు తనయుడు పై విమర్శల దాడి చేయడం జరిగింది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కేంద్రమంత్రి చిదంబరాన్ని ఎందుకు కలిశారో చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఆమోస్, యాదవరెడ్డి డిమాండ్ చేశారు. సమన్యాయం అంటున్న చంద్రబాబు ఏం చేయాలో కూడా చెప్పాలన్నారు. ప్రధానమంత్రి హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటారని వారు పేర్కొన్నారు. టీడీపీ నేతలు నీచంగా మాట్లాడుతున్నారని ఆమోస్, యాదవరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు సబ్ జూనియర్ నేతగా మాట్లాడుతున్నారని వారు విమర్శించారు. తెలంగాణ బిల్లుపై ఓటింగే అవసరం లేనప్పుడు ఎమ్మెల్యేలను కొనే అవసరం ఎవరికుందని సూటిగా ప్రశ్నించారు.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ పై టీఆర్ఎస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. సత్యం రామలింగరాజు పెంపుడు కొడుకు లోకేష్ అని.... ఆయన డబ్బులతోనే చిన్నబాబు విదేశాల్లో చదివాడని ఆపార్టీ ఆరోపించింది. లోకేష్...'ట్విట్టర్కి ఎక్కువ...రాజకీయాలకు తక్కువ' అంటూ టీఆర్ఎస్ ఎద్దేవా చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more