Police operation continue against terrorists in puttur

Police Operation continue against Terrorists in Puttur, Terrorists attack police in Puttur

Police Operation continue against Terrorists in Puttur, Terrorists attack police in Puttur

పుత్తూరు ఉగ్రవాదుల వార్నింగ్ ఇంటిని పేల్చివేస్తాం

Posted: 10/05/2013 01:41 PM IST
Police operation continue against terrorists in puttur

ఈరోజు ఉదయమే పుత్తూరులో పోలీసులు సోదాలు నిర్వహించారు. అక్కడ ఓ ఇంట్లో ఉన్న ఉగ్రవాదులు పోలీసులపైకి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సిఐ మృతిచెందినట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్ లో తమిళనాడు పోలీసులతో పాటు ఎపి పోలీసులు కూడా పాల్గొంటున్నారు. ఉగ్రవాదులు మూడు, నాలుగు ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు.

 

'ఇంటిని పేల్చివేస్తాం'

పోలీసులు ఇంటిని చుట్టముట్టగానే ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. పోలీసులు మాత్రం కాల్పులు జరిపితే ఇంటిని పేల్చివేస్తామని ఉగ్రవాదులు హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఆ ఇంటిలో చిన్న పిల్లలతో పాటు ఒక మహిళ కూడా ఉన్నారని సమాచారం.

 

బిలాల్ ఎవరు ?

సేలం ప్రాంతంలో బీజేపీ నేత హత్య కేసులో బిలాల్ ప్రధాన నిందితుడు. అంతేగాక మధురై పేలుడు కేసుల్లో, అద్వానీ సభలో బాంబు పేలుడు ఘటలో బిలాల్ కు సంబంధం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

 

ఉగ్రవాది బిలాల్..

బిలాల్ తో సహా కడలూరు ఉగ్రవాద టీం ఈ ఇంట్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు కాల్పులు జరిపితే ఉగ్రవాదులు పెను ప్రమాదం సృష్టించే అవకాశం ఉందని తెలుస్తోంది. 6 నెలల క్రితమే ఇక్కడ స్థావరం ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం వీరి వద్ద రాడ్స్, మారణాయుధాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరంతా ఎలక్ట్రానిక్ పరికరాల వ్యాపారం కోసం ఇక్కడికి చేరుకున్నట్లు సమాచారం. వీరంతా బాంబులు తయారు చేస్తున్నట్లు సమాచారం.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles