ఆంద్ర ఉద్యోగులు తెలంగాణ నుండి వెళ్లిపోవాలి అని కేసిఆర్ ఇచ్చిన పిలుపుకు సీమంద్ర ఉద్యోగులు మండిపడుతున్నారు. అయితే తెలంగాణ నాయకులు కూడా కేసిఆర్ పై విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో కేసిఆర్ (మామ)కు మేనల్లుడు హరిశ్ రావు సపోర్టు వచ్చారు. మామ మాటలను మీడియా వక్రీకరించిందని కొత్త పల్లవి ఎత్తుకున్నారు. కెసిఆర్ (మామ) సహజసిద్ధమైన ప్రక్రియనే చెప్పారని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం నడవాలి, దానికి అక్కడ ఉద్యోగులు కావాలి, అనుభవం ఉన్నవారు అక్కడికి వెళ్లిపోతే తెలంగాణ ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయని కెసిఆర్ చెప్పినట్లు ఆయన వివరించారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఏం జరుగుతుందో ఎస్సార్సీలో చెప్పిన విషయాన్నే కెసిఆర్ చెప్పినట్లు ఆయన తెలిపారు. తెలంగాణలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆంధ్ర ఉద్యోగులు వెళ్లిపోవాలని ఎన్టీరామారావు, నారా చంద్రబాబు నాయుడు, వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వాలు చెప్పిన విషయాన్నే కెసిఆర్ చెప్పారని, అందులో కొత్త విషయమేమీ లేదని, సంచలనం సృష్టించే అంశం ఎంత మాత్రమూ లేదని ఆయన అన్నారు. కెసిఆర్ (మామ) వ్యాఖ్యల్లో ఉద్దేశ్యాలు గానీ దురుద్దేశ్యాలు గానీ లేవని ఆయన అన్నారు. ఏదో అయిపోయిందని బురద జల్లే కార్యక్రమం చేపట్టడం దురదృష్టకరమని ఆయన అన్నారు. ఇక్కడ పనిచేస్తున్న ఆంధ్ర ఉద్యోగులు అక్కడికి వెళ్లిపోవడమే కాదు, ఆంధ్రలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు ఇక్కడికి రావాలని కూడా కెసిఆర్ అన్నట్లు ఆయన తెలిపారు. మామ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే .. మేనల్లుడు ఆ వ్యాఖ్యలకు ఆయిల్ మెంట్ పూస్తున్నాడని సీమాంద్ర నాయకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more