నష్టాలనేవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి- ఒక పని చేసినందువలన, లేదా చెయ్యలేకపోయినందువలన వచ్చే నష్టం. రెండవది- ఒక పని చేసుంటే, లేదా చెయ్యకుండా ఉంటే వచ్చే లాభాన్ని చెయిజార్చుకోవటం వలన అంటే పోగొట్టుకోవటం వలన కాగితం మీద లెక్కకట్టే నష్టం. రెండవది నిజానికి నష్టం లోకి రాదు. ఆశించిన లాభం రాలేదంతే కానీ నష్టం అనిపించుకోదు.
ఈ రెండిటికీ మధ్య ఉన్న చిన్న వ్యత్యాసాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వ ఆడిటర్లయిన కాగ్ ను తప్పుపట్టింది. 2జి కుంభకోణంలో 1.76 లక్షల కోట్ల నష్టం వచ్చిందన్న కాగ్ ప్రకటన తప్పని, దీనివలన ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్యానికి మచ్చతెచ్చే విధంగా, అవినీతి దేశాల జాబితాలో చేర్చే విధంగా కాగ్ నివేదికనిచ్చిందని జెపిసి తన డ్రాఫ్ట్ నివేదికలో ఆరోపించింది. ప్రభుత్వం అవలంబించిన లైసెన్సింగ్ విధానం వలన ప్రభుత్వ ఖజానాకి అంతలేసి నష్టం వాటిల్లిందని చెప్పిన కాగ్, సామాన్య ప్రజానీకానికి జరిగిన ప్రయోజనాన్ని మాత్రం లెక్కలోకి తీసుకోలేదని జెపిసి తన నివేదికలో పేర్కొంది.
అసలు నష్టం జరిగింది ఎన్ డి ఏ ప్రభుత్వం సమయంలోనేనని కూడా జెపిసి నివేదిక పేర్కొంది. మైగ్రేషన్ ప్యాకేజ్ ల వలన జరిగిన నష్టాన్ని టెలికాం శాఖ ఎప్పుడూ పరిగణనలోకి తీసుకోలేదని, దాని వలన టెలికాం లైసెన్స్ ఫీజుని ఒక్కసారే కట్టవలసి రావటంతో భారీ నష్టాన్ని ప్రభత్వం చవిచూసిందని జెపిసి ఆరోపిస్తోంది. ఎన్డీయే హయాంలో జనవరి 2002 లో 6.2 MHz పరిమితిని దాటి 10 MHz వరకు వాళ్ళకి నచ్చిన కంపెనీలకు అదనపు స్పెక్ట్రమ్ ని ఇచ్చారని, అలా అదనపు స్పెక్ట్రమ్ ని కేటాయించటానికి అప్పటి సమాచార శాఖా మంత్రి ప్రమోద్ మహాజన్ కి పంపితే ఆయన ఒక్కరోజులోనే అనుమతినిచ్చేసారని, ఫిబ్రవరి 1 న ఢిల్లీ, ముంబై డివిజన్ లలో కొన్ని కంపెనీలకు వెంటనే స్పెక్ట్ర్రమ్ కేటాయింపులు చకచకా జరిగిపోయాయని, అంతేకాకుండా, కావాలనే స్పెక్ట్రమ్ ని అతి తక్కువ రేటు వేసిందని కూడా జెపిసి ఆరోపించింది.
ఏతా వాతా, ప్రస్తుత ప్రధానమంత్రి కాదు, అప్పటి ఎన్ డి ఏ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్ పాయ్ దే తప్పంతా అని, 1999లో తీసుకున్న నిర్ణయాల వలన 40000 కోట్ల నష్టం వాటిల్లిందని జాయింట్ పార్లమెంటరీ కమిటీ తేల్చింది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more