తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయడ్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ఒకే సారి షర్మిల ఉతికి ఆరేశారు. హాలియాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో షర్మిల రెచ్చిపోయారు. రాష్ట్రానికి ఈ ఇద్దరు ఏం చేశారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లాలోని జానారెడ్డి నేతృత్వం వహిస్తున్న హాలియాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ..వడ్డీలేని రుణాలు ఇస్తామంటూ ప్రచారానికి కోట్ల రూపాయలు సీఎం ఖర్చు చేస్తున్నారని.. అయితే ఇప్పటివరకు ఎవరికీ వడ్డీలేని రుణాలు ఇవ్వలేదని షర్మిల తెలిపారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు కరెంట్ చార్జీలు పెంచలేదని, ఇప్పుడు రాష్ట్రంలో 108 వాహనం ఎక్కడా కనిపించడం లేదని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. జానారెడ్డి గత 30ఏళ్లుగా అధికారం అనుభవిస్తున్నారని.. సొంత నియోజకవర్గాన్ని కూడా చక్కదిద్దుకోకపోవడం సిగ్గుచేటని ఆమె అన్నారు. అంతేకాకుండా తాగునీరు కూడా అందించని మంత్రి ఒక మంత్రేనా అని తీవ్రస్థాయిలో షర్మిల విమర్శించారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి ఏం చేశారని షర్మిల ప్రశ్నించారు. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. రెండు ఎకరాలతో రాజకీయాల్లోకి వచ్చిన బాబు వేల కోట్లు సంపాదించారని.. అసమర్ధ ప్రభుత్వమంటూ విమర్శలు చేస్తున్న చంద్రబాబు ఎందుకు అవిశ్వాసం పెట్టడం లేదని షర్మిల ప్రశ్నించారు. చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలతోనే సాక్షిపై దాడి జరిగిందని.. చంద్రబాబుది నిజమైన పాదయాత్ర కాదని..వైఎస్ఆర్ చేసిన పాదయాత్ర మహాయజ్ఞంలా ఉండేదని షర్మిల తెలిపారు. జగనన్న తర్వలోనే బయటకు వస్తారు.. రాజన్న రాజ్యం వస్తుందన్నారు. బోనులో ఉన్నా... సింహం సింహమేనని షర్మిల అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more