తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలంటూ తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ గన్పార్క్ వద్ద మౌనదీక్ష చేపట్టారు. ఈ దీక్ష శిబిరంలో పెద్ద సంఖ్యలో తెలంగాణవాదులు, విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపి వినోద్ కుమార్ మాట్లాడుతూ... హైదరాబాద్ కేంద్ర పాలనప్రాంతంగా చేయడానికి వీలులేదని ఆయన అన్నారు.ప్రజాస్వామ్య బద్దంగా తెలంగాణ ఉద్యమం సాగుతున్నదని,తెలంగాణ ఏర్పాటు తధ్యమని, ఆ దిశలో ముందుకు సాగాలని ఆయన అన్నారు. తెలంగాణ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ కోదండరామ్ మాట్లాడుతూ హింస తమ అభిమనం కాదని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవటం భావ్యం కాదన్నారు. బిజెపి నేత బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ మౌన దీక్షను గాందీజీ ఏ విదంగా నిర్వహించారో అలాగే చేస్తున్నామని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more