నేపాల్ మాజీ ప్రధాని, మావోయిస్టు పార్టీ అధినేత ప్రచండ(57)కు ఓ యువకుడి చేతిలో చేదు అనుభవం ఎదురైంది. సొంత పార్టీకి చెందినవాడిగా భావిస్తున్న ఓ యువకుడు ఆయనను బహిరంగంగా చెంపదెబ్బ కొట్టాడు. దీపావళి, ఛాత్, నేపాలీ నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని ప్రచండ సారథ్యంలోని యూసీపీఎన్ (మావోయిస్టు) పార్టీ ఇచ్చిన తేనీటి విందులో ఈ సంఘటన చోటుచేసుకుంది. బహిరంగంగా అందరూ చూస్తుండగానే యువకుడు ప్రచండ చెంపపై కొట్టాడని, ఆయన కళ్లద్దాలు కూడా ఎగిరిపోయాయని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన యువకుడిని పశ్చిమ నేపాల్లోని బగ్లుంగ్ జిల్లాకు చెందిన పవన్ కున్వర్ ( 25)గా గుర్తించారు. అయితే, దీనిపై ఆగ్రహించిన పార్టీ నేతలు, కార్యకర్తలు వెంటనే పవన్ను చితకబాదారు. తీవ్రంగా గాయపడిన అతడిని తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విందుకు నేపాల్ ప్రధాని బాబూరాం భట్టారాయ్, నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు సుశీల్ కొయిరాలా, సీపీఎన్-యూఎంఎల్ చైర్మన్ ఝలానాథ్ ఖనల్, మధేషీ పార్టీ అధ్యక్షుడు ఉపేంద్రయాదవ్తోపాటు వివిధ పార్టీల సీనియర్ నేతలు హాజరయ్యారు. కాగా, మళ్లీ ఎన్నికలు నిర్వహించి దేశంలోని రాజ్యాంగ, రాజకీయ సంక్షోభాన్ని రూపుమాపడంలో మావోయిస్టు పార్టీ, ప్రస్తుత ఆపద్ధర్మ ప్రభుత్వం విఫలమయ్యారంటూ ఈ సందర్భంగా నేపాలీ కాంగ్రెస్, సీపీఎన్-యూఎంఎల్, మధేషీ పార్టీల నేతలు విమర్శించారు. రాజ్యాంగాన్ని త్వరగా ఆమోదించేందుకుగాను పార్టీలన్నీ ఏకాభ్రిపాయం, సహకారంతో జాతీయ ఏకతా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాల్సిన అవసరముందని నొక్కిచెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more