యూపీఏ ప్రభుత్వంలోని మన్మోహన్ సింగ్ కేబినెట్ లో భారీ పునర్ వ్యవస్థీకరణకు తెర లేచింది. 2014 ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని ఈ కేబినెట్ విస్తరణ జరగనుంది. కొత్తగా మంత్రి పదవులు పొందే వారు ఈ రోజు ఈ ఉదయం 11:30 గంటలకు కొత్తమంత్రులు రాష్ట్రపతి భవన్లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. పాత వారికి ప్రమోషన్లు ఇస్తూ, కొత్త వారికి ఈ కేబినెట్ లో స్థానం కల్పించనున్నారు. ఇప్పటికే కేబినెట్ లో ఉన్న మునియప్పకు ప్రమోషన్ ఇవ్వనున్నారు. ఆయనకు ఉపరితల రవాణాశాఖ కేటాయిస్తారు. విద్యుత్ శాఖ మంత్రిగా జ్యోతిరాదిత్య సింధియా, పెట్రోలియం శాఖ మంత్రిగా గులాంనబీ ఆజాద్, పట్టణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రిగా అజయ్ మాకెన్ను నియమించనున్నారు. మానవవనరుల శాఖను కపిల్ సిబల్ నుంచి పల్లంరాజుకు అప్పగిస్తారు. కపిల్ సిబల్ టెలికాంశాఖను కేటాయించనున్నారు.. విదేశాంగ మంత్రి పదవి అభ్యర్థిగా సల్మాన్ ఖుర్షీద్ ఇప్పుడు తెరపైకి వచ్చారు. ఎస్.ఎం.కృష్ణ స్థానంలో ఖుర్షీద్కు అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు సమాచారం.
రాష్ట్రం నుంచి ఇప్పటికే మంత్రిగా ఉన్న పల్లంరాజుకు కేబినెట్ హోదా లభించనుంది. ఆయనకు మానవవనరుల అభివృద్ధి శాఖ( కేబినెట్), జైపాల్ రెడ్డికి శాస్త్రసాంకేతిక శాఖ ( కేబినెట్), చిరంజీవికి పర్యాటక శాఖ సహాయమంత్రి ( స్వతంత్ర), పురంధేశ్వరికి వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి ( స్వతంత్ర), కోట్ల సూర్యప్రకాశ రెడ్డికి షిప్పింగ్ శాఖ సహాయ మంత్రి, సర్వే సత్యనారాయణకు రైల్వేశాఖ సహాయ మంత్రి, బలరాం నాయక్కు సామాజిక న్యాయ సహాయ మంత్రి, కిల్లి కృపారాణికి వైద్య ఆరోగ్యశాఖ సహాయ మంత్రి పదవులు లభించనున్నాయి. ఈ కేబినెట్ లో స్థానం దక్కిన వారు కాంగ్రెస్ పార్టీకి వీర విధేయులుగా ఉన్నవారే. మరి వీరు ఏ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి మేలు చేస్తారో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more