భారతదేశంలో క్షీర విప్లవానికి నాంది పలికి, పాడి పరిశ్రమ సమగ్రాభివృద్ధికి దోహదం చేసిన పితామహుడు వర్గీస్ కురియన్ ఆదివారం కన్నుమూశారు. 90 సంవత్సరాల కురియన్ దీర్ఘకాలంగా అస్వస్థతో బాధపడుతున్నారు. ఆనంద్ జిల్లా పొరుగున ఉన్న నాదియాద్లోని ముల్జ్భీయ్ పటేల్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. భారత దేశం పాడి పరిశ్రమలో ప్రపంచంలో అగ్రస్థానంలో నిలవడానికి ఈయన విశేష క్రుషి చేశారు. ఆయన 1921 నవంబర్ 26వ తేదీన కేరళలోని కోజికోడ్లో జన్మించారు. చెన్నైలోని లయోలా కాలేజీలో సైన్స్లో డిగ్రీ చదివారు. ఆ తర్వాత ప్రభుత్వ ఉపకారవేతనంతో డైరీ ఇంజనీరింగ్ చేశారు. బెంగళూర్లోని పశు సంవర్ధన, పాడి పారిశ్రమ సంస్థలో శిక్షణ తీసుకున్నారు.
మిషిగాన్ విశ్వవిద్యాలయంలో 1948లో మెకానికల్ ఇంజనీరింగులో మాస్టర్స్ డిగ్రీ చేశారు. డైరీ ఇంజనీరింగ్ ప్రత్యేకాంశంగా ఈ మాస్టర్స్ డిగ్రీ చేశారు.ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేసిన రాష్టప్రతి ప్రణబ్ ‘వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పాడిపరిశ్రమ అభివృద్ధికి విశేషంగా దోహదం చేసిన వ్యక్తి' అని కొనియాడారు. భారత సహకార ఉద్యమ పితామహులలో ఒకరుగా కురియన్ను ప్రధాని మన్మోహన్ సింగ్ అభివర్ణించారు. ఆయన సృష్టించిన క్షీర విప్లవం పాల ఉత్పత్తిలో భారత్ను నిరుపమాన దేశంగా మార్చిందని మన్మోహన్ అన్నారు. భారత ప్రభుత్వం ఆయనను పద్మ విభూషణ్తో గౌరవించింది. రామన్ మేఘసేసే అవార్డు కూడా ఆయనను వరించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more