ఎస్సీ, ఎస్టీ నిధుల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ కోత పెట్టబోమని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సబ్ ప్లాన్ నివేదికను రాష్ట్ర చరిత్రలోనే సరికొత్త అధ్యాయంగా అభివర్ణించారు. ఎస్సీ, ఎస్టీలకు సేవ చేసేది కాంగ్రెస్ పార్టీయేనన్న సిఎం క్షేత్రస్థాయిలో పనులు జరగాలంటే నిఘా తప్పని సరన్నారు. ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ్మ నేతృత్వంలో ఏర్పాటైన మంత్రి వర్గం ఉప సంఘం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి నివేదిక సమర్పించింది. దీంతో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు చేసేందుకు సమగ్ర చట్టం చేసేందుకు ప్రభుత్వం ముందడుగు వేసినట్లైంది.
అటు సబ్ ప్లాన్ నివేదికను రాష్ట్ర చరిత్రలోనై ఓ మైలురాయిగా సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అభివర్ణించారు. ఇప్పటి వరకు వీటిని సక్రమంగా ఖర్చు చేయని మాట వాస్తవేమేనని అంగీకరించారు. ఉప సంఘం అందించిన నివేదికను మంత్రివర్గంలో చర్చిస్తామని హామీ ఇచ్చారు. ఇక ముందు ఎస్సీ, ఎస్టీ నిధుల్లో కోత ఉండబోదని ప్రకటించారు. మరోవైపు జనాభా ప్రాతిపదికన నిధులు ఖర్చు చేయాలని డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ్మ విజ్ఞప్తి చేశారు. నివేదిక కోసం రాష్ట్రవ్యాప్తంగా అనేక వర్క్ షాపులు నిర్వహించి క్షేత్రస్ఖాయిలో ఎస్సీ, ఎస్టీల సమస్యలు తెలుసుకున్నామని చెప్పారు. నిధులు దుర్వినియోగం కాకుండా భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కేబినెట్ ఆమోదం తర్వాత సబ్ ప్లాన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది.
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more