రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్పీ పరీక్ష కొద్దిసేపటి క్రితం మొదలైంది. ఇవాళ్టి నుంచి మూడురోజుల పాటు ఉపాధ్యాయ ఉద్యోగాలకు పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 21వేల 343 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, ఎస్జీటీ, లాంగ్వేజి పండిట్, వ్యాయామ ఉపాధ్యాయ ఉద్యోగాలకు 4 లక్షల 23వేల మంది దరఖాస్తు చేశారు. 26, 27, 28 తేదీల్లో జరిగే పరీక్షకోసం రాష్ట్రవ్యాప్తంగా 1874 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి అత్యధికంగా 31, 462 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవగా, అత్యల్పంగా హైదరాబాద్ లో 7,824 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారు.. స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పేపర్ ఉదయిం పది నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు..... స్కూల్ అసిస్టేంట్ నాన్ లాంగ్వేజ్ పరీక్ష మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం నాలుగున్నర గంటల వరకు జరగనున్నాయి.
27 వతేదీ ఉదయం ఎస్జీటీ సాయంత్రం పిఈటీ, లాంగ్వేజ్ పండిట్ పరీక్షలు జరగనున్నాయి. ఇక 28 ఉదయం ప్రత్యేక పాఠశాలల్లో లాంగ్వేజ్, నాన్ లాంగ్వేజ్ ఉద్యోగాలకు పరీక్ష జరగనుంది. మూడురోజులూ పరీక్షలు ఎటువంటి అడ్డంకులలేకుండా జరిగేందుకు డిఎస్పీ పరీక్ష కేంద్రాల దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. అభ్యర్థులు గంటముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని...ఆలస్యం అయితే లోనికి అనుమతించరని తెలిపారు. అటు డిఎస్సీ రాతపరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎన్ శివశంకర్ కూడా సూచనలు చేశారు. పరీక్ష రోజు ఒక గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. పరీక్షకు ఆలస్యంగా వస్తే అనుమతించమని తెలిపారు. సెల్ ఫోన్ లు,ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్షా కేంద్రానికి అనుమతించమని స్పష్టం చేశారు. పరీక్షల్లో ఎటువంటి క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డా ఎపియాక్ట్ 25/1997, ఇతర చట్టాల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్షలు జరిగే తేదీల్లో అభ్యర్థులకు అసౌకర్యం కలగకుండా ఆర్టీసి ప్రత్యేక బస్సులు నడుపుతుందని తెలిపారు.
..avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more