పేద విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల దరఖాస్తు గడువు నిన్నటితో ముగిసింది. ఫ్రీ-మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల కోసం విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించే తుది గడువు ఆగస్టు 15 అని ప్రభుత్వం ముందుగా ప్రకటించింది. ఆగస్టు 15 పబ్లిక్ హాలిడే కావడంతో మంగళవారం వరకే పాఠశాలలు, కళాశాలల్లో దరఖాస్తులు తీసుకున్నారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం లక్ష రూపాయల లోపు ఉన్న బీసీ, మైనారిటీ, ఈబీసీ వర్గాల విద్యార్థులు, తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2 లక్షలు లోపు ఉన్న ఎస్సీ, ఎస్టీ వర్గాల విద్యార్థులు ఫీజుల రీయింబర్స్మెంట్, స్కాలర్షిష్ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. దరఖాస్తుతో పాటు ఆదాయ, నివాస, కుల ధృవీకరణ పత్రాలను విద్యార్థులు
జతచేయవలసి ఉంటుంది. ఈ ధృవీకరణ పత్రాలు జారీ చేయడంలో తీవ్ర జాప్యం జరగడం కారణంగా విద్యార్థులు సకాలంలో దరఖాస్తులను విద్యా సంస్థల్లో దాఖలు చేయలేకపోయారు. ఈ ఏడాది నుంచి వివిధ ధృవీకరణ పత్రాలను ఆన్లైన్ ద్వారా పొందే అవకాశం ప్రభుత్వం కల్పించింది. ఆన్లైన్ ద్వారా ధృవీకరణ పత్రాల జారీలో తీవ్ర జాప్యం ఏర్పడటంతో వేలాది మంది నగరంలో స్కాలర్షిప్లు పొందే అవకాశాన్ని కోల్పోయారు. గత ఏడాదితో పోల్చితే స్కాలర్షిప్ల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోయిందని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. వివిధ ధృవీకరణ పత్రాల జారీలో జరిగిన జాప్యం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని నేతలు పేర్కొంటున్నారు. దరఖాస్తు చేసుకునే గడువును మరో నెల రోజులు పొడించాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
..avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more