మన భారతీయుడి విలువు ఎంతో తెలుసా? అక్షరాల 57 లక్షలు . మన భారతీయుడిని పట్టిస్తే .. 57 లక్షలు ఇస్తామాని మొదటి సారి ఒక దేశం ప్రకటన చేసింది. మన భారతీయుడి పై ఆ దేశం ఎందుకు రివార్డ్ ప్రకటించిందంటే .. 2008, అక్టోబర్లో ఓ రోడ్డు ప్రమాదానికి కారకుడైన భారతీయ డ్రైవర్ ఆచూకీ తెలిపితే రూ.57 లక్షల రివార్డ్ అందిస్తామని ఆస్ట్రేలియా ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. దేశ చరిత్రలో ఇలాంటి ప్రకటన ఇదే మొదటిది కావడం విశేషం. వివరాలు.. భారత దేశానికి చెందిన పునీత్(19) 2008, అక్టోబర్లో సౌత్బ్యాంక్లోని నగర రోడ్డుపై కారు నడపడం నేర్చుకుంటున్నాడు. ఆ సమయంలో అదుపుతప్పి క్వీన్స్ల్యాండ్కు చెందిన ఇద్దరు పాదచారులు డీన్ హాఫ్స్టీ(19), క్లాన్సీ క్లోకర్లను కారుతో ఢీకొన్నాడు. ఈ ఘటనలో డీన్ హాఫ్స్టీ అక్కడికక్కడే మృతి చెందగా, క్లోకర్ తీవ్రంగా గాయపడ్డాడు.
దీనిపై స్థానిక ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి, పునీత్ను కోర్టులో హాజరుపరిచారు. అనంతరం, బెయిల్పై విడుదలైన పునీత్, 2009 ఆగస్టు నాటి కోర్టు విచారణకు హాజరుకాలేదు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, ఆ ఏడాది జూన్ 12నే పునీత్ తన స్నేహితుని పాస్పోర్టు సాయంతో దేశం విడిచి వెళ్ళిపోయాడని గుర్తించారు.కాగా, పునీత్కి పాస్పోర్టు ఇచ్చిన అతని స్నేహితుడికి కోర్టు రెండున్నర సంవత్సరాల కారాగారం విధించింది. మరోపక్క పునీత్ ఆచూకీ కోసం పోలీసులు జల్లెడపట్టినా ఫలితం కనిపించలేదు. దీంతో రివార్డు ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత పునీత్ ఆచూకీ వెల్లడవుతుందనే నమ్మకం ఉందని పోలీస్ సహాయ కమిషనర్ రాబర్ట్ హిల్ ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్లోని ఆస్ట్రేలియా రాయబారి పీటర్ వార్ఘీస్ రివార్డ్ ప్రకటనను స్వాగతించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more