కులదీప్ నయ్యర్ తన ఆత్మకథలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావుపై చేసిన విమర్శలపై పెద్ద దుమారమే చెలరేగుతోంది. దేశాన్ని మతపరమైన సంక్షోభంలోకి నెట్టిన బాబ్రీ విధ్వసం సమయంలో పీవీ పూజలో నిమగ్నమయ్యారన్న వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. ఈ వ్యాఖ్యలను అప్పటి పీవీ మీడియా సలహాదారు పీవీఆర్కే ప్రసాద్ ఖండించారు. యూపీలో కల్యాణ్ సింగ్ ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని ప్రసాద్ తెలిపారు. యూపీలో రాష్ట్రపతి పాలనకు అవకాశమే లేదని, అదనపు బలగాలను పంపుతామన్న కేంద్ర సూచనను నాటి సీఎం కళ్యాణ్ సింగ్ తోసిపుచ్చారన్నారు. సీనియర్ జర్నలిస్టు కులదీప్ వ్యాఖ్యలపై సీఎల్పీ మండి పడింది. ఇది మతతత్వ శక్తుల కుట్ర అని సీఎల్పీ ఆరోపించింది. బాబ్రీ మసీద్
కూల్చివేత నిర్లక్ష్యానికి పివి ఒక్కరే బాధ్యులు కాదని కాంగ్రెస్ పార్టీ నాటి ఘటనకు భాద్యత వహించాలని సీనియర్ పాత్రికేయులు తెలకపల్లి రవి అన్నారు. బాబ్రీ వివాదానికి అసలు తెర తీసింది రాజీవ్ గాంధీయేనని, 1989లో రాజీవ్ అక్కడ ఎన్నికల ప్రచారం చేశారని గుర్తు చేశారు.
కులదీప్ నయ్యార్ వ్యాఖ్యలను తెలకపల్లి స్వాగతించారు. బాబ్రీ వివాదంలో పివి పేరు వినిపించడం ఇదే తొలిసారి కాదు. లిబ్రహాన్ కమీషన్ ఎదుట పివి వాంగ్మూలమిచ్చినా రాజకీయంగా ఆయనపై దాడి మాత్రం ఆగలేదు. బాబ్రీ ఘటనకు పివిని బాధ్యుడ్ని చేసే ప్రయత్నాలు ఆగలేదు. కులదీప్ నయ్యర్ తాజా రచనతో ఈ వివాదం మళ్లీ రాజుకున్నట్టైంది. కాగా, బాబ్రీ మసీదును కూల్చేసిన రోజు దివంగత మాజీ ప్రధాని పివీ.నరసింహరావు మానసికంగా కుంగిపోయి తలదించుకున్నారని మాజీ కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి చంద్రశేఖర్ రావు అన్నారు. అప్పటి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ అఫిడవిట్ ఇవ్వడం, సుప్రీం కోర్టు దానిని నమ్మి జోక్యం చేసుకోవడం ఫలితంగానే పీవీ అక్కడ రాష్ట్రపతి పాలన విధించలేకపోయారన్నారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more