మొట్టమొదటిసారిగా అంతరిక్షంలో మానవ డాకింగ్ ప్రక్రియను పూర్తిచేసి తన శాస్త్ర పరిశోధనా పాటవాన్ని రుజువుచేసింది. ఓ మహిళా వ్యోమగామి సహా ముగ్గురు చైనా వ్యోమగాములు 13 రోజుల రోదసి యాత్రను పూర్తిచేసుకుని సురక్షితంగా భువికి చేరుకున్నారు. మాన్యువల్ డాకింగ్ ప్రక్రియను సజావుగా పూర్తిచేయడం ద్వారా ఇప్పటికే అమెరికా, రష్యాలకే సొంతమైన జాబితాలో చైనా కూడా తన పేరును నమోదు చేసుకుంది. 2020కల్లా అంతరిక్షంలో ఐఎస్ఎస్ తరహాలో ఓ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటుచేయాలన్న లక్ష్యంలో భాగంగా ఈ ముగ్గురు వ్యోమగాములను చైనా ఇటీవల రోదసికి పంపింది. ఈ ముగ్గురితో షెన్ఝౌ-9 అనే వ్యోమనౌక సజావుగా మంగోలియాలోని ఓ పచ్చిక బయలు ప్రాంతంలో దిగినట్లుగా తెలుస్తోంది. భూ వాతావరణంలోకి ప్రవేశించేముందు తీవ్రస్థాయిలో ఎదురైన వేడిని తట్టుకుని ఈ వ్యోమనౌక విజయవంతంగా వెనక్కి తిరిగి రాగలిగింది. ఇది భూమికి పది కిలోమీటర్ల ఎత్తులో ఉండగానే ఒక ప్యారాచూట్ దానినుంచి విచ్చుకుంది. ఆవిధంగా ఈ వ్యోమనౌక వేగం తగ్గింది. నెమ్మదిగా ఒక పెద్ద శబ్దంతో నిర్దేశిత ప్రాంతంలో దిగింది. ఇది భూమిమీద దిగిన తర్వాత దానినుంచి బయటకు రావడానికి ముగ్గురు వ్యోమగాములకు గంటకు పైగా పట్టింది. ఈ మొత్తం కార్యక్రమాన్ని చైనా ప్రధాని వెన్ జియా బావో, ఇతర సీనియర్ అధికారులు ఉత్సాహంగా తిలకించారు. ఈ ముగ్గురి వ్యోమగాముల్లో మొదట జింగ్ హైపెంగ్ అనే కమాండర్ బయటికొచ్చారు. ఆ తర్వాత 33 ఏళ్ల నియూ వాంగ్, తొలి మహిళా వ్యోమగామి లియూయాంగ్ వచ్చారు. తొలిసారిగా స్పేస్ డాకింగ్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేయగలిగామని, అంతే ఉత్సాహంగా స్వదేశానికి తిరిగి రాగలిగామని జింగ్ హైపెంగ్ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more