కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, విద్యుత్ ఛార్జీలు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 31న భారత్ బంద్కు 11 విపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ ఆ రోజు బంద్ పాటించి, విజయవంతం చేయాలని ఆయా పార్టీలు విజ్ఞప్తి చేశాయి. కేంద్రప్రభుత్వం పెట్రోల్ ధరలను భారీగా గతంలో ఎన్నడూ లేని విధంగా లీటరుకు ఏడున్నర రూపాయలు పెంచింది. దీనికి తోడు గ్యాస్ ధరను సిలిండర్ రూ.50 పెంచాలని, డీజీల్ లీటర్కు రూ.5 పెంచాలని యోచిస్తున్నదని ఆయా పార్టీలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఈ ధర పెంపుతో రాష్ట్ర ప్రజలపై రూ.1250 కోట్లు భారం పడుతుందని, ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్పై 33 శాతం, డీజీల్పై 22 శాతం వ్యాట్ను వసూలు చేస్తున్నదని, వామపక్ష నాయకులు తెలిపారు. కేంద్రం ధర పెంచినప్పుడల్లా తగ్గించామని కోరా ల్సిన రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ రాబడితో సంబరపడుతుందని వారు విమర్శించారు. వ్యాట్ వల్ల రూ.250 కోట్ల రాబడి వస్తుండటంతో వ్యాట్ను తగ్గించుకోవటానికి నిరాకరిస్తుందని తెలిపారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీల బిల్లులు ప్రజలకు ఇప్పుడిప్పుడే అందుతున్నాయని, ఛార్జీల పెంపుదల కనీసం 20 శాతం నుంచి 80 శాతం వరకు ఉందని వామపక్ష పార్టీల నాయకులు తెలిపారు.
ఈ నేపథ్యంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ విధానాలను, ఛార్జీల పెంపుదలను వ్యతిరేకిస్తూ ఈ నెల 31న రాష్ట్ర బంద్ను పాటించాలని వారు పిలుపునిచ్చారు. ప్రజలంతా బంద్కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు బంద్కు మద్దతు ఇవ్వాలని 11 వామపక్ష పార్టీల నాయకులు కోరారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more