వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఇవాళ కూడా సిబిఐ ఎదుట హాజరయ్యారు. తన నివాసం లోటస్ పాండ్ నుంచి ఉదయం 10.20 గంటల ప్రాంతంలో జగన్ దిల్ కుశా అతిథిగృహానికి బయలుదేరి వెళ్లారు. దీంతో ఆయన వరుసగా మూడవ రోజూ సిబిఐ విచారణకు హాజరైనట్లైంది.
కాగా, జగన్ ఆస్తుల వ్యవహారంలో రెండో రోజూ విచారణ యథాతథంగా కొనసాగింది. లోటస్ పాండ్ నుంచి ప్రత్యేక వాహన శ్రేణిలో బయలు దేరిన జగన్ సరిగ్గా పదిన్నరకు రాజ్ భవన్ రోడ్డులోని దిల్ కుషా అతిథి గృహానికి చేరుకున్నారు. రెండో రోజు భద్రతా, వ్యక్తిగత సిబ్బంది బయటే నిలిచిపోగా జగన్ వెంట సబ్బం హరి, భూమానాగిరెడ్డి వచ్చారు. ఆ తర్వాత జగన్ ఒక్కరే సీబీఐ కార్యాలయం లోపలికి నడుచుకుంటూ వెళ్లారు. విచారణలో సీబీఐ జేడీ లక్ష్మినారాయణ, ఎస్పీ వెంకటేష్ నేతృతంలోని అధికారుల బృందం జగన్ ను ప్రశ్నించింది.
ఉదయం 11.30నిమిషాల నుండి 12గంటల వరకు జేడీనే స్వయంగా జగన్ ను ప్రశ్నించినట్లు తెలిసింది. విచారణలో భాగంగా జగన్ ను 143 ప్రశ్నలను అడిగినట్లు సమాచారం. పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ ముందే జగన్ ను ప్రశ్నించారని జగన్ సన్నిహిత వర్గాలన్నాయి. నిమ్మగడ్డ ప్రసాద్ జగన్ కు చెందిన జగతి, ఇందిరా, జననీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లో 550కోట్ల పెట్టుబడులపై ఆరా తీసినట్లు తెలిసింది. సండూరి పవర్ ప్రాజెక్టు ఆగిపోయినా నిధులు ఎలా వచ్చాయి? అని జగన్ ను ప్రశ్నించినట్లు సన్నిహిత వర్గాలన్నాయి. 2004లో 9లక్షలు, 2009 లో 77కోట్ల రూపాయల ఆదాయపన్ను చెల్లించినట్లు రికార్డుల్లో పేర్కొన్నారు. అడ్వాన్స్ ట్యాక్స్ కూడా కట్టారు. ఇంత తక్కువ సమయంలో ఇంత ఆదాయం ఎలా పెరిగిందని జగన్ ను సీబీఐ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే దేవుడు నాతో ఉన్నాడని జగన్ ఈ ప్రశ్నకు బదులిచ్చినట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇథోరియా ఇన్ ఫ్రా , కార్మేల్ ఏషియా, ఇండస్ ప్రాజెక్ట్ , సండూర్ పవర్ వంటి వాటిపై జగన్ ను 143ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది.
వైఎస్.రాజశేఖర్ రెడ్డి హయాంలో విడుదలైన జీవోలపై కూడా జగన్ ను ప్రశ్నించినట్లు ఆయన సన్నిహిత వర్గాలన్నాయి. ఓ వైపు జగన్ ను ప్రశ్నిస్తూనే ఈకేసులో ఇప్పటికే అరెస్టయిన మోపిదేవి, నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానందరెడ్డిలను మరోగదిలో సీబీఐ అధికారులు ప్రశ్నించారు. జగన్ ను సీబీఐ ప్రశ్నిస్తున్న సమయంలోనే సీబీఐలోని ఓ బృందం అబిడ్స్ గన్ ఫౌండ్రీ లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ లో జగన్ కు సంబంధించిన అకౌంట్స్ పై ఆరా తీసింది. ఇందులో భాగంగానే జగన్ అకౌంట్స్ సంబంధించిన లెక్కాపద్దులన్నింటినీ సిడిలో కాపీ చేసుకున్నట్లు తెలిసింది.
ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం రెండున్నర వరకు జగన్ విచారణ పర్వం కొనసాగింది. ఆతర్వాత అరగంటపాటు భోజన విరామం ఇచ్చారు. వ్యక్తిగత సిబ్బంది క్యారియర్ తీసుకరాగా జగన్ అక్కడే లంచ్ చేశారు. ఆతర్వాత జగన్ ప్రశ్నిస్తున్న దిల్ కుషా అతిథిగృహం.. నాంపల్లి కోర్టు వద్ద కాస్త హడావుడి మొదలైంది. కోర్టు వద్ద కనివినీ ఎరుగని రీతిలో భద్రతను పెంచారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దీంతో కాసేపు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది. సాయంత్రం సరిగ్గా ఆరుగంటలకు జగన్ విచారణ ముగిసింది.
దాదాపు ఏడున్నర గంటలపాటు సీబీఐ ఆయన్ను ప్రశ్నించింది. అయితే సీబీఐ అడిగిన ప్రతీ ప్రశ్నకు సమాధానం ఇచ్చానని జగన్ చెప్పారు. ఇవాళ కూడా సీబీఐ ముందు వైఎస్ జగన్ హాజరవుతుండటంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తలపెట్టారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more