పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మళ్లీ కోపం వచ్చింది. ఓ టీవీ చానెల్ లైవ్ షోలో దీదీ సహనం కోల్పోయారు. కార్టూన్ వ్యవహరంపై జాదవ్ పూర్ ప్రొఫెసర్ ను ఎందుకు అరెస్టు చేశారన్న ప్రశ్నకు ఆమె అడ్డదిడ్డంగా మాట్లాడారు. విద్యార్థులు మావోయిస్టులంటూ నోరు పారేసుకున్నారు. అంతేకాదు ఆగ్రహంతో ఊగిపోయిన దీదీ రుసరుసలాడుతూ లైవ్ షో ను రసాభాసగా మార్చారు. జనం చూస్తున్నారు. విద్యార్థులు, మేధావులతో మాట్లాడుతున్నాన్న విచక్షణ కోల్పోయిన మమతా బెనర్జీ ఆగ్రహంతో రగిలి పోయారు.
ఇంతకీ ఆమెకు ఎందుకు కోపం వచ్చిందంటే తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనా పూర్తైన సందర్భంగా ఓ టెలివిజన్ ఛానెల్ విద్యార్థులతో ముఖాముఖీ ఏర్పాటు చేసింది. ఈ షోలో పాల్గొన్న విద్యార్థులు జాదవ్ పూర్ యూనివర్సీటీ ప్రొఫెసర్ అరెస్ట్ పై ప్రశ్నించారు. కార్టూన్ వ్యవహారంలో ప్రొఫెసర్ ను ఎందుకు అరెస్ట్ చేశారంటూ సూటిగా అడగటంతో మాయాకు చిర్రెత్తుకొచ్చింది. సహనం కోల్పోయిన దీదీ ఆగ్రహంతో ఊగిపోయారు. కార్టూన్ లు అంటే తనకూ ఇష్టమేననీ జాదవ్ పూర్ ప్రొఫెసర్ సీపీఎం పార్టీకి చెందిన వ్యక్తనీ తన ఇ మెయిల్ ను దుర్వినియోగం చేసి వారి అంగీకారం లేకుండా ఆకార్టూన్ ను 60మందికి పంపాడంటూ దీదీ చెలరేగారు.
పశ్చిమ బెంగాల్లో మహిళలపై నేరాలు పెరుగుతున్నాయన్న ఓ స్టూడెంట్ ప్రశ్నకూ మమతా మండిపడ్డారు. తన పాలనలో మహిళలకు పూర్తి స్తాయిలో భద్రత ఉందని చెప్పుకొచ్చారు. ఇంతటితో మమతా కోపం చల్లారలేదు. షోలో పాల్గొన్న వారిలో కొందరు సీపీఎం కార్యకర్తలనీ, మరికొందరు మావోయిస్టుల సానుభూతి పరులంటూ నోరు పారేసుకున్నారు. అంతేకాదు మైక్ తీసేసి లైవ్ షో సగంలోనే వెళ్లిపోయారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more