ఉస్మానియా యూనివర్సిటీలో ఆదివారం నిర్వహించిన బీఫ్ ఫెస్టివల్ (ఎద్దుకూర పండుగ) ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఫెస్టివల్ను ఒక వర్గం విద్యార్థులు నిర్వహించగా... మరో వర్గం విద్యార్థులు వ్యతిరేకించారు. ఓయూ ప్రజాస్వామ్య సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో సాయంత్రం 6 30 గంటలకు క్యాంపస్ ఎన్ఆర్ఎస్ హాస్టల్ ఆవరణలో ‘బీఫ్ ఫెస్టివల్’ను నిర్వహించారు. పలువురు ఫ్రొఫెసర్లు, ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని కొన్నివిద్యార్థి సంఘాలు వ్యతిరేకించడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి హాజరైన ప్రముఖుల ఉపన్యాసాలు ముగిసిన అంనతరం భోజనాలకు ఉపక్రమించారు. ఇదే సమయంలో కొందరు విద్యార్థులు బీఫ్ ఫెస్టివల్ను వ్యతిరేకిస్తూ న్యూ పీజీ హాస్టల్ నుంచి కార్యక్రమా వేదిక వైపు దూసుకువచ్చే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. వారు వెనక్కితగ్గకపోవడంతో పోలీసులు లాఠీలకు పని కల్పించారు. అయినా పరిస్థితి అదుపులోకి రాలేదు.
బాష్పవాయువు గోళాలను ప్రయోగించారు. దీంతో విద్యార్థులు చెల్లాచెదురయ్యారు. ఆగ్రహంతో ఊగిపోయిన కొంతమంది విద్యార్థులు సీ హాస్టల్ ముందు ఆగి ఉన్న ‘జెమిని న్యూస్’ లైవ్ వాహనానికి నిప్పుపెట్టారు. తర్వాత కొద్దిసేపు వాతావరణం నివురుగప్పిన నిప్పుగా మారింది. కొంతమంది విద్యార్థులపై దాడులు జరుగుతున్నాయన్న వదంతులు వినిపించాయి. ఓల్డ్ పీజీ నుంచి ఎన్ఆర్ఎస్ హాస్టల్ వైపు వెళ్తున్న ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. బీఫ్ ఫెస్టివల్ కార్యక్రమంలో పీడీఎస్యూ సత్య, కవిత, తెలుగు యూనివర్సిటీల విద్యార్థులు పాల్గొన్నారు.
ఎద్దు మాంసం పౌష్టికాహారం: రిటైర్డ్ ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు
ఎద్దు మాంసం మనుషుల ఆరోగ్యానికి మంచిదని, ఇందులో పలు ప్రోటిన్స్ ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారని ఓయూ రిటైర్డ్ ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు అన్నారు. ఎవరికి నచ్చిన ఆహారాన్ని వారు తినవచ్చునని అన్ని పార్టీలు తమ ఎన్నికల మెనిఫెస్టోలో పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలందరికీ స్వేచ్ఛ ఉందని, తమ హక్కులను హరించే అధికారం ఎవరికీ లేదని ఓయూ ఎస్సీ, ఎస్టీ టీచర్స్ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ గాలి వినోద్కుమార్ అన్నారు.
రాజ్యాంగంలో పలానా కూరనే తినాలి, ఎద్దుకూర తినొద్దు అని ఎక్కడా లేదన్నారు. తమకు విలువ ఇవ్వని హిందూ మతాన్ని వెలివేస్తున్నామని పేర్కొన్నారు. బీఫ్ ఫెస్టివల్ను నిర్వహించడం ద్వారా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు మార్పునకు నాంది పలికారని ఓయూ టీచర్స్ ఫోరం ఫర్ తెలంగాణ కన్వీనర్ ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more