చివరకు భారతీయులకు పవిత్రమైన పంచాంగం పై కూడా వివాదంలో చిక్కుకుంది. పంచాంగం భారతీయలకు ఎంతో నమ్మకం ఉంటుంది. అలాంటి పంచాంగన్ని కూడా ఇప్పుడు కోర్టులో.. ముద్దాయిగా నిలబడింది. పంచాంగం ఎలా చెబుతుందో .. అలాగే భారతీయు ప్రజలు నడుచుకుంటారు. ఇప్పుడు ఆ పంచాంగం రాసిన వారిని కోర్టులాగే పనిలో మహిళాలు బిజీగా ఉన్నారు.
బాలికలను కించపరిచేలా పంచాంగంలో కొన్ని వ్యాఖ్యలు చేసిన పొన్నలూరి శ్రీనివాస గార్గేయపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని కోరుతూ మహిళా, బాలల హక్కుల సంఘాలు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సీ)ను ఆశ్రయించాయి. ఈ మేరకు సామాజిక కార్యకర్తలు పి.ఎ.దేవి, సి.హెచ్.మురళీమోహన్, తెలంగాణ అమ్మల సంఘం నుంచి అల్లం పద్మ, ఏపీ మహిళా సమతా సొసైటీ నుంచి పి.ప్రశాంతి, బాలల హక్కుల సంఘం నుంచి అచ్యుతరావు, ప్రజాతంత్ర మహిళా సంఘం నుంచి జ్యోతి, స్వరూపారాణిలతోపాటు ప్రగతిశీల మహిళా సంఘం, తెలంగాణ మహిళా విద్యార్థి సంఘం, చైతన్య మహిళా సమాఖ్యలు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశాయి. మహిళా సంఘాల ప్రతినిధులు కమిషన్ సభ్యులు కాకుమాను పెద పేరిరెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు.
గార్గేయ వ్యాఖ్యలు.. మహిళలు, బాలికల సహజసిద్ధమైన రుతుధర్మాలను కించపర్చడమే అవుతుందని తెలిపారు. బాలికల మనోభావాలను గాయపర్చేలా వ్యాఖ్యలు చేయడం మానసిక హింసగా, బాలల హక్కులను హరించడంగా పరిగణించాలని కోరారు. మహిళల గౌరవానికి భంగం కలిగించిన గార్గేయపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని నివేదించారు. పిటిషన్ను పరిశీలించిన పేరిరెడ్డి.. ఇది తమ పరిధిలోకి రాదని స్పష్టం చేస్తూ పిటిషన్లను కొట్టివేశారు. పేరిరెడ్డి నిర్ణయంపై మహిళా సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. తమ పిటిషన్లను మరోసారి విచారణకు స్వీకరించాలంటూ రివ్యూ పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై మంగళవారం కమిషన్ చైర్మన్ జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూ నేతృత్వంలోని ధర్మాసనం నిర్ణయం తీసుకోనుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more