నిన్న గాలి జనార్దన రెడ్డి రాక బెంగళూరు సిటీ సివిల్ కోర్టులో గాలి దుమారం రేపింది. ఎప్పిటినుంచో మీడియా మీద కత్తిగట్టిన బెంగళూరు లాయర్లు నిన్న జనార్దన రెడ్డి కేసుని కవర్ చెయ్యటానికి వస్తారని తెలిసి ముందుగా వేసుకున్న పథకం ప్రకారమే మీడియా మీద విరుచుకుపడి దొరికినవాళ్ళని దొరికినట్టు విరగగొట్టారు. అడ్డుపడ్డ పోలీసులనూ వదిలిపెట్టలేదు. వాహనాల మీదా ప్రతాపం చూపించారు. కోర్టులో న్యాయమూర్తి మీద కూడా కనికరం చూపించకుండా గాయపడేట్టుగా దాడిచేసారు. కోర్టులో ఫర్నిచర్ ని ధ్వంసం చేసారు. పోలీసు అధికారి మీద చెయి చేసుకున్నారు. లాయర్లకు జనార్దనరెడ్డి మద్దతుదారులైన గూండాలు కూడా సహకరించారని ప్రత్యక్ష సాక్షుల కథనం.
చట్టం ప్రకారం నడుచుకోవలసిన న్యాయవాదులు తమ బుద్ధిబలంతో పోరాటం సలపవలసిన వారు వారు నమ్ముకున్న న్యాయాలయంలోనే భుజబలాన్ని ఉపయోగించి ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించటం, హింసకు పాల్పడటాన్ని కర్నాటక ముఖ్యమంత్రి సదానంద గౌడ ఖండించారు. నిందితులను గుర్తించి, వారెవరైనా సరే శిక్షిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఏదో పూనినట్టుగానే లాయర్లంతా కోర్టు ఆవరణనంతా రణరంగంగా మార్చి ఎంతో మందిని గాయపరచారు. గాయపడ్డవారితో హాస్పిటల్స్ లో డాక్టర్లంతా ఒక్కసారిగా బిజీ అయిపోయారు. బెంగలూరు నిమ్హన్స్, కెసి జనరల్ హాస్పిటల్స్ కి 62 మంది క్షతగాత్రులను తరలించారు. అందులో పోలీసులు కూడా ఉన్నారు. ఒక హెడ్ కాన్ స్టబుల్ మరణించారన్నది సరికాదని, అందరినీ ఔట్ పేషెంట్స్ గా చికిత్స చేసి పంపించామని హాస్పిటల్ లో డాక్టర్లంటున్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more