చాలా కాలంగా నానుతున్న మంత్రివర్గ విస్తరణ విషయంలో జాప్యం చెయ్యటమెందుకన్నది ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆలోచనైతే, రాజకీయాలలో ప్రతి నిర్ణయాన్నీ ఆచీతూచీ తీసుకోవలి లేకపోతే మనుగడకే ముప్పు రావచ్చన్నది ఢిల్లీ పెద్దల ఆలోచనగా కనపడుతోంది. నిజానికి మంత్రి వర్గ విస్తరణ రాష్ట్రానికి సంబంధించిన విషయమే కానీ పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఏ నిర్ణయమైనా కేంద్రంలోని పార్టీ అధిష్టాన వర్గం ఆమోదం పొందాల్సిందే కాబట్టి తనకు మద్దతునిచ్చే దిశగా తన సొంత వర్గాన్ని పెంచుకునేందుకు కిరణ్ కుమార్ రెడ్డి వేగిరపడుతున్నారు. జనవరి 24 మంచి రోజు మరి ఆరోజు మంత్రి వర్గ విస్తరణ చెయ్యనా, అందులో పిఆర్ పి కి, తెలంగాణా నాయకులకు చోటివ్వనా అని అడుగుతున్నారాయన.
నిన్న ఢిల్లీ వెళ్ళిన కిరణ్ కుమార్ రెడ్డి అక్కడ పార్టీలో మన రాష్ట్ర వ్యవహారాలను పరిశీలించే గులామ్ నబీ ఆజాద్ తో దాదాపూ రెండు గంటల కాలం చర్చలు జరిపారు. అయితే అంతకు ముందే పిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ కూడా ఆజాద్ తో భేటీ అయ్యారు. మంత్రి వర్గ విస్తరణ విషయంలో ఇద్దరూ భిన్నాభిప్రాయాలను వెలిబుచ్చారని తెలుస్తోంది. కోర్ కమిటీ సభ్యులతో కూడా సమావేశమయ్యే అవకాశం ఉంది.
పక్కలో బల్లెంలా ప్రతిదానికీ తనకి వ్యతిరేకంగా మాట్లాడే మంత్రులు కాకుండా తనను సమర్థించి తనకు చేయూతగానిచ్చే తన సొంత బృందాన్ని తయారుచేసుకోవాలని కిరణ్ కుమార్ ఆలోచన. అయితే మంత్రి విస్తరణ మొదలవుతుందనగానే ఎంతోమంది నేతలు ఢిల్లీకి ప్రయాణం కట్టి తమ తమ అర్జీలను పెట్టుకుంటుంటారు. దానితో ఎవరికి అవకాశం ఎవరు ఆగ్రహానికి గురౌతారోనన్న భయం కూడా పెద్దలలో ఉంటుంది. మద్దతుగా నిలబడే మంత్రులను పెట్టుకుంటే వారితో ప్రజలలోకి వెళ్ళగలిగే కార్యక్రమాలను రూపొందించుకుని వచ్చే ఎన్నికలలోగా ప్రజలలో సద్భావన పెంచుకోవలని కిరణ్ కుమార్ అనుకుంటుంటే, ఎన్నికలలోపులో మంత్రివర్గం లో వచ్చే మార్పుల మూలంగా కొందరు పార్టీ మారే అవకాశం కూడా ఉందన్నది ఆజాద్ ఉద్దేశ్యం.
తన హోదాని, తను పనిచేస్తున్న పార్టీని బలోపేతం చేసుకోవలన్నది రాజకీయంలో కీలకమైన ప్రణాళికే. ఎంత మంచి మంచి ఆలోచనలు, ఎంత సేవా తత్పరత ఉన్నా, పదవే లేకపోతే చెయ్యగలిగిందేమీ లేదు కాబట్టి కుర్చీని కాపాడుకోవటం కూడా అవసరమే. అయితే అందులోనే ఎక్కువ సమయం కాదు దాదాపూ సమయమంతా వెచ్చిస్తున్నారని విశ్లేషకులు, రాజకీయ పండితుల ఆవేదన.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more