రెండు వర్గాల మధ్య కలహాలు రేపే విధంగా దినపత్రికలో ప్రచురితమైన జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్య స్వామి రాసిన వ్యాసం మీద ఢిల్లీ పోలీసులు ఆయనను ప్రశ్నించారు. జూలై లో ప్రచురించబడ్డ ఆ వ్యాసం మీద, సమాజంలోని మతవర్గాల మధ్య విభేదాన్ని రేపినందుకు పెట్టే ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 153 ఏ కింద క్రైమ్ బ్రాంచ్ సుబ్రహ్మణ్య స్వామి మీద అక్టోబర్ 3 న కేసు నమోదు చేసింది. ఈరోజు 11 గంటలకు సుబ్రహ్మణ్య స్వామి ఢిల్లీ పోలీసు క్రైం బ్రాంచ్ శాఖలో హాజరయ్యారు.
అయితే జనవరి 30 వరకు ఆయనకు ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు శుక్రవారం ఇంటరిమ్ బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరుకి ముందు, ఇటువంటి వ్యాసాలను భవిష్యత్తులో రాయనని హామీ ఇవ్వవలసిందిగా కోర్టు కోరింది. యాంటిసిపేటరీ బెయిల్ విషయంలో తమ స్పందనను తెలియజేయమని హైకోర్టు పోలీసు శాఖకు నోటీసు పంపించింది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more