వైయస్ జగన్ కాంగ్రెస్ పార్టీని వీడి సొంత పార్టీ పెట్టుకున్నటి నుండి కాంగ్రెస్ ప్రభుత్వం పై కన్నా తెలుగు దేశం పార్టీ పైనా, ఆ పార్టీ నాయకుడు చంద్రబాబునాయుడు పైనా విరుచుకు పడుతున్న విషయం తెలిసిందే. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. దీనికి తాజాగా పార్లమెంటు సాక్షిగా జరిగిన సంఘటనే ఉదాహారణ. ఆసంఘటన ఏంటంటే... జగన్ జన్మదినం సందర్భంగా ఆయనను పార్లమెంటు సెంట్రల్ హాల్లో పలువురు ఎంపీలు కలసి శుభాకాంక్షలు చెప్పారు. అందులో టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి కూడా ఉండటం విశేషం. ఆయన కేవలం శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా ఆయన దాదాపు అర్ధగంట సేపు జగన్తో మాట్లాడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.
ఈ క్రమంలో దీనిపై టీడీపీ వర్గాల్లో చర్చ మొదలయింది. విజయమ్మ వేసిన కేసులో చౌదరిని కూడా బాబుతో పాటు ప్రతివాదిగా చేర్చిన విషయం తెలిసిందే. జగన్పై అవకాశం వచ్చినప్పుడల్లా టీడీపీ నాయకత్వం ధ్వజమెత్తుతూనే ఉంది. బుధవారం పార్లమెంటులో టీడీపీపీ నేత నామా నాగేశ్వరరావు, రమేష్రాథోడ్, నారాయణ వంటి ఎంపీలు జగన్కు ఎదురుపడినా వారు ఆయనతో కనీసం మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు. అలాంటి ది.. సుజనా చౌదరి వెళ్లి జగన్కు శుభాకాంక్షలు చెప్పవలసిన అవస రం ఏమిటని, దానివల్ల క్యాడర్కు వెళ్లే సంకేతాలు ఏమిటని పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే, తాను సాధారణంగానే జన్మదిన శుభాకాంక్షలు చెప్పానని, తనతో పాటు చాలామంది ఎంపీలు కూడా జగన్కు శుభాకాంక్షలు చెప్పారని సుజనా చౌదరి వాదిస్తున్నారు. అయితే అక్కడున్న వారు జగన్ సుజనా చౌదరికీ గాలం వేస్తున్నాడని, వీరిద్దరు కలిసిపోబోతున్నారని అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more