Jagan team

Jagan team.GIF

Posted: 12/17/2011 09:44 AM IST
Jagan team

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి కాంగ్రెస్ చెందిన ఎమ్మెల్యేలు జగన్ పార్టీలో చేరి ప్రయత్నించిన విషయం తెలిసిందే, దీంతో ఆగ్రహించిన అధిష్టానం వీరి పై వేటు వేయడానికి సిద్ధం అయింది. అవిశ్వాసం వీగిపోయి ఇన్ని రోజులైనా వారికి ఇంకా నోటీసులు జారీ చేయలేదు. అననుకూల పరిస్థితుల వలన జాప్యం జరిగినా ఈ 16 మంది కాంగ్రెస్ సభ్యులకు సోమవారం నాడు నోటీసులు పంపే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్న రాత్రి ఢిల్లీ నుండి వచ్చిన స్పీకర్ మనోహర్ నేడు వీటి పై నిర్ణయం తీసుకుని, సోమవారం నోటీసలు జారీ చేసే అవకాశం ఉంది.

కాగా.. సోమవారం రోజే పీఆర్పీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి నుంచి స్పీకర్ వివరణ తీసుకోనున్నారు. ఆమె శాసనసభా సభ్యత్వంపై స్పీకర్ అదే రోజు నిర్ణయం తీసుకునే వీలుందని శాసనసభా వర్గాలు చెబుతున్నాయి. కాగా.. జగన్‌వర్గ ఎమ్మెల్యేలను మంగళవారం తన ఎదుట హాజరు కావాలని స్పీకర్ కోరే అవకాశం ఉందని ఈ వర్గాలు పేర్కొంటున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chiranjeevi
Bsnl employees  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles