ఆనకట్ట వివాదం కట్టలు తెంచుకుని చెలరేగుతోంది. కేరళకు చెందిన ముత్తూట్ ఫైనాన్స్, మణప్పురం గోల్డ్ సంస్థల తమిళనాడులోని అండిపట్టిలో ఉన్న కార్యాలయాలమీద ఆందోళనకారులు దాడి చేసి కార్యాలయ అద్దాలను పగలగొట్టారు. ఆందోళనకారులలో స్త్రీలు కూడా ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పదివేల మంది వరకూ కూడిన తమిళనాడు ఆందోళనకారులు కేరళకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, కేరళ, తమిళనాడు సరిహద్దులలో ఆందోళనసాగించారు. కేరళ ప్రభుత్వం శాసనసభలో ముళ్ళపెరియార్ డ్యాం గురించి చర్చించి కొత్త డ్యాం ను నిర్మించవలసిందేనని తీర్మానం చేసారు. అలాగే తమిళనాడులో కూడా శాసనసభలో ఈ విషయంలో చర్చ జరగాలని ఆందోళనకారులు పట్టుబట్టారు. కంభం, చిన్న మనూర్, గూడలూర్, అండిపట్టి సరిహద్దుల్లో ఆందోళన ఎక్కవగా కనిపిస్తోంది. వ్యాపారస్తులు స్వచ్ఛందంగా నిన్న ఒకరోజు బంద్ పాటించారు. దాదాపూ అన్ని రాజకీయ పార్టీలూ మద్దతునివ్వటంతో బంద్ సంపూర్ణంగా జరిగి గ్రామాల్లో సైతం జనజీవనం స్తంభించిపోయింది. ఇరు రాష్ట్రాల మధ్య రాకపోకలైతే పూర్తగా ఆగిపోయాయి.
ఈ ముళ్ళై పెరియార్ డ్యాం వివాదానికి మూలం మరో విషయం ఉందని అణు విద్యుత్ కి వ్యతిరేకంగా పోరాడే సంస్థ పిఎంఏఎన్ఈ చెప్తోంది. కూడన్ కుళం అణు విద్యుత్ కేంద్రం తమిళనాడు ప్రజల శ్రేయస్సు దృష్ట్యా మంచిది కాదని ఆందోళన చేస్తున్న ఈ సంస్థ, ముళ్ళపెరియార్ డ్యాం గురించి చర్చించటానికి సమావేశమవుతున్న శాసనసభలో ఆ విద్యుత్ కేంద్రాన్ని మూసివేయాలనే తీర్మానాన్ని కూడా తీసుకోవాలని పట్టుబడుతోంది. ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలు ఈ అణు వ్యతిరేక ఉద్యమాన్ని పక్కదారి పట్టించటం కోసమే ముళ్ళపెరియార్ డ్యాం వివాదాన్ని తెరమీదకు తెచ్చారని వారు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు మరో రెండు అణు విద్యుత్ కేంద్రాలను కూడన్ కుళం పరిసరాల్లోనే నెలకొల్పటం కోసం ఒప్పందానికి ఈ నెల 15న రష్యా వెళ్తన్న ప్రధాన మంత్రి పట్ల ఆగ్రహాన్ని ప్రకటిస్తూ, తమిళనాడు ప్రజల క్షేమం పట్టదా వారి అభిప్రాయాలకు విలువ లేదా అని మండిపడుతున్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more