రాష్ట్రాన్ని రావణ కాష్టంలా చేసి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించి, కేంద్రానికి మింగుడు పడకుండా చేస్తూ ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ వాదులు కేంద్రం పై ఒత్తిడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ పై కేంద్రం కమిటీలు వేసి, అభిప్రాయాల సేకరణలు కూడా తీసుకుంది. ఇదిగో అదిగో అంటూ ఊరిస్తున్న పబ్బం గడుపుతున్న కాంగ్రెస్ పార్టీ తాజాగా మరో చావు కబురు చెప్పింది. దానికి తెలంగాణ తెచ్చేది – ఇచ్చేది – చచ్చేది మేమే అంటూ ఇన్ని రోజులు గడిపిన కాంగ్రెస్ నాయకులలో ఒకరు అయిన డి. శ్రీనివాస్ కేంద్రం చెప్పినదానికి తలూపి తెలంగాణ ప్రజల ఆశల పై నీళ్ళు చల్లారు. తెలంగాణ అంశం ఇప్పటికిప్పుడు తేలదని ఆయన కచ్చితంగా చెప్పేశారు. తెలంగాణపై ఇప్పటికిప్పుడు కేంద్రం నిర్ణయం తీసుకోబోదని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రాంతీయ మండలి ఏర్పాటు ఆలోచన కేంద్రం వద్ద లేదని ఆయన అన్నారు.
ఈనెల 22న పార్లమెంటు సమావేశాలు ముగిసిన తరువాత తెలంగాణ పై ప్రాంతీయ మండలి వేసే అవకాశాలు ఉన్నాయని, ఈ విషయం పై కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ పరిధిలో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. బోడోలాండ్, గూర్ఖాలాండ్ లకు ఏర్పాటు చేసినట్లు ప్రాంతీయ మండలిని తెలంగాణ ఏర్పాటు చేస్తారని.. దానికి ప్రకటించినట్లుగానే ప్రత్యేక ప్యాకేజీనే ఏర్పాటు చేయబోతున్నారని విశ్వసనీయ సమాచారం. ఈ మండలికి ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా డి.శ్రీనివాస్ ను నియమిస్తారని ఢిల్లీ వర్గాల సమాచారం.
అప్పుడు, ఇప్పుడు అంటూ 204 ఎన్నికల వరకు కూడా లాగాలనేది కాంగ్రెసు పెద్దల ఆలోచనగా కనిపిస్తోంది. అయితే సోనియా బర్త్ డే రోజు ఈ అంశం పై డీఎస్ మాట్లాడం ఆమె బర్త్ డే రోజు తెలంగాణ వాదులకు చావు చెప్పారని అంటున్నారు. మరి దీని పై తెలంగాణ వాదులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more