బ్యాడ్మింటన్లో ప్రపంచ ఛాంపియన్, తెలుగుతేజం పీవీ సింధు ఖాతాలో మరో అత్యున్నత అవార్డు చేరే అవకాశముంది. దేశంలోని మూడో అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్ కోసం సింధు పేరును క్రీడాశాఖ ప్రతిపాదించింది. ఈ మేరకు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇటీవల జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్లో సింధు స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.
ఇక రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ కోసం ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్ బాక్సర్ మేరీ కోమ్ పేరును ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. పద్మ పురస్కారాలు-2020 కోసం అర్హులైన వారి జాబితాను క్రీడాశాఖ ఇటీవల అవార్డుల కమిటీకి పంపింది. తొలిసారిగా మొత్తం మహిళా క్రీడాకారులతో ఈ జాబితాను తయారుచేసినట్లు సమాచారం. సింధు, మేరీకోమ్లతో పాటు మరో ఏడుగురు మహిళా అథ్లెట్ల పేర్లను సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.
ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫోగట్, టేబుల్ టెన్నిస్ స్టార్ మనికా బత్రా, క్రికెటర్ హర్మన్ప్రీత్ కౌర్, హాకీ కెప్టెన్ రాణి రాంఫాల్, మాజీ షూటర్ సుమ శిరూర్, పర్వతారోహకులు తాషి, నుంగ్షీ మాలిక్ పేర్లను పద్మశ్రీ పురస్కారాలకు ప్రతిపాదించినట్లు సదరు మీడియా కథనాలు పేర్కొన్నాయి. వచ్చే ఏడాది గణతంత్ర వేడుకల సందర్భంగా పద్మ పురస్కారాల గ్రహీతల పేర్లను ప్రభుత్వం ప్రకటించనుంది. ఇప్పటికే 2015లో కేంద్ర ప్రభుత్వం సింధును పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
ఇక ప్రముఖ బాక్సర్ మేరీకోమ్ను 2006లో పద్మశ్రీ, 2013లో పద్మభూషణ్ అవార్డులు వరించాయి. ఈసారి ఆమెకు పద్మవిభూషణ్ పురస్కారం ఇస్తే.. ఈ ఘనత సాధించిన నాలుగో క్రీడాకారిణిగా మేరికోమ్ నిలుస్తారు. ఇప్పటివరకు చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్(2007), క్రికెట్ లెజండ్ సచిన్ తెందుల్కర్(2008), దివంగత పర్వతారోహకులు సర్ ఎడ్మండ్ హిల్లరీ ఈ పురస్కారం అందుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more