Mary Kom PV Sindhu on Padma awards list పద్మ అవార్డుల జాబితాలో పీవీ సింధూ, మేరీకామ్

Mary kom and pv sindhu on ministry s padma awards list

Cricket, India Vs South Africa, India vs South Africa ODI series, India's tour of South Africa, ODI Cricket, South Africa vs India 2018, Virat Kohli, Yuzvendra Chahal, South Africa cricket team, Khaya Zondo, Indian cricket team, Imran Tahir, Hashim Amla, Cricket news, Sports news, latest news, sports, cricket news, cricket

Another Virat Kohli batting masterclass guided India to a historic 5-1 series victory with a comfortable 8 wicket win in Centurion

పద్మ అవార్డుల జాబితాలో పీవీ సింధూ, మేరీకామ్

Posted: 09/12/2019 05:14 PM IST
Mary kom and pv sindhu on ministry s padma awards list

బ్యాడ్మింటన్‌లో ప్రపంచ ఛాంపియన్‌, తెలుగుతేజం పీవీ సింధు ఖాతాలో మరో అత్యున్నత అవార్డు చేరే అవకాశముంది. దేశంలోని మూడో అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్‌ కోసం సింధు పేరును క్రీడాశాఖ ప్రతిపాదించింది. ఈ మేరకు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇటీవల జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సింధు స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.

ఇక రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్‌ కోసం ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ బాక్సర్‌ మేరీ కోమ్‌ పేరును ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. పద్మ పురస్కారాలు-2020 కోసం అర్హులైన వారి జాబితాను క్రీడాశాఖ ఇటీవల అవార్డుల కమిటీకి పంపింది. తొలిసారిగా మొత్తం మహిళా క్రీడాకారులతో ఈ జాబితాను తయారుచేసినట్లు సమాచారం. సింధు, మేరీకోమ్‌లతో పాటు మరో ఏడుగురు మహిళా అథ్లెట్ల పేర్లను సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.

ప్రముఖ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌, టేబుల్‌ టెన్నిస్‌ స్టార్‌ మనికా బత్రా, క్రికెటర్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, హాకీ కెప్టెన్‌ రాణి రాంఫాల్‌, మాజీ షూటర్‌ సుమ శిరూర్‌, పర్వతారోహకులు తాషి, నుంగ్షీ మాలిక్‌ పేర్లను పద్మశ్రీ పురస్కారాలకు ప్రతిపాదించినట్లు సదరు మీడియా కథనాలు పేర్కొన్నాయి. వచ్చే ఏడాది గణతంత్ర వేడుకల సందర్భంగా పద్మ పురస్కారాల గ్రహీతల పేర్లను ప్రభుత్వం ప్రకటించనుంది. ఇప్పటికే 2015లో కేంద్ర ప్రభుత్వం సింధును పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

ఇక ప్రముఖ బాక్సర్‌ మేరీకోమ్‌ను 2006లో పద్మశ్రీ, 2013లో పద్మభూషణ్‌ అవార్డులు వరించాయి. ఈసారి ఆమెకు పద్మవిభూషణ్‌ పురస్కారం ఇస్తే.. ఈ ఘనత సాధించిన నాలుగో క్రీడాకారిణిగా మేరికోమ్‌ నిలుస్తారు. ఇప్పటివరకు చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌(2007), క్రికెట్‌ లెజండ్‌ సచిన్‌ తెందుల్కర్‌(2008), దివంగత పర్వతారోహకులు సర్‌ ఎడ్మండ్‌ హిల్లరీ ఈ పురస్కారం అందుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India Vs South Africa  centurion  ODI Cricket  ODI Series  south africa  Team India  Virat Kohli  cricket  

Other Articles