లోకంలో తల్లి ప్రేమను మించింది లేదు. తన పంచప్రాణాలను పణంగా పెట్టైనా సరే తల్లి తన బిడ్డలను కాపాడుకుంటుంది. ఇది సకల చరాచర సృష్టిలో అన్ని జీవులకు వర్తిస్తుంది. మరీ ముఖ్యంగా మన వరకు అమ్మ ప్రేమ అజరామరం అని అంటాం. కానీ అంతటి ప్రేమను పంచాల్సిన తల్లే.. బిడ్డ పాలిట యమపాశమైతే? ఏమి కష్టం వచ్చిందో తెలియదు కానీ.. ఓ కన్నతల్లి ఎంతో కర్కషంగా తన బిడ్డను బలి తీసుకుంది. కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఎస్ఆర్ నగర్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
నాలుగో అంతస్తులో ఉన్న తమ అపార్ట్మెంట్ ముందు బిడ్డతో కలిసి నిలబడి ఉన్న ఒక తల్లి.. కాసేపు అలా చూసి, చేతుల్లోని బిడ్డను ఎత్తి కిందకు విసిరేసింది. ఆ తర్వాత తను కూడా దూకేందుకు రెయిలింగ్ ఎక్కి కాసేపు అలా చూస్తూ ఉండిపోయింది. అదే సమయంలో ఇంట్లో నుంచి బయటకు వచ్చిన కుటుంబ సభ్యులు ఆమెను కాపాడారు. ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘాతుకానికి పాల్పడిన యువతి డెంటిస్ట్గా ఉద్యోగం చేస్తోంది. ఆమె భర్త సాఫ్ట్వేర్ ఉద్యోగి. కాగా, వారి నాలుగేళ్ల పాపకు మూగ, చెవిటి వైకల్యం ఉండటం.. దాంతో ఆ మహిళ తీవ్ర మనస్థాపం గురైంది.
పుట్టు చెవిటీ, మూగ అయిన బాలికకు కొండంత అండగా నిలివాల్సిన తల్లి.. మనోధైర్యం కోల్పోవడంతో తన చేతులతోనే ప్రాణాలను తీసింది. నాలుగు అంతస్థుల పైనుంచి కిందపడిన చిన్నారి.. తీవ్ర రక్తస్రావంతో మరణించింది. భర్త ఫిర్యాదుతో ఆ తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని, ఆ మహిళ మానసిక పరిస్థితిని కూడా పరిగణలోకి తీసుకుంటామని పోలీస్ అధికారి తెలిపారు. కాగా, మహిళ తన కుమార్తెను బిల్డింగ్ పైనుంచి కిందకు విసిరేసిన దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి.
A woman was arrested in #Bengaluru for killing her four-year-old mentally challenged daughter by throwing her from the fourth floor of a building, police said. pic.twitter.com/S96GaVblxx
— IANS (@ians_india) August 5, 2022
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more