ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత ఏర్పడిన రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అశేషంగా తరలివచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రముఖులు మధ్య ప్రమాణస్వీకారం చేశారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్.. వైఎస్ జగన్ చేత సరిగ్గా 12గంటలా 24 నిమిషాలకు ప్రమాణస్వీకారం చేయించారు. వైఎస్ జగన్ అనే నేను అనే సమయంలో స్టేడియంలోని దిక్కులు పెక్కుటిల్లేలా.. సీఎం.. సీఎం.. అనే నినాదాలతో హోరెత్తారు. పార్టీ కార్యకర్తలు నినాదాల మధ్యే ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారమహోత్సవాన్ని పూర్తి చేశారు.
అంతకు ముందు ఆయన తాడేపల్లిలోని తన స్వగృహం నుంచి బయలుదేరి విజయవాడలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిఫల్ స్టేడియానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రమాణస్వీకారానికి బయలుదేరే ముందు ఆయనను టీటీడీ వేద పండితులు ఆశీర్వాదం అందజేశారు. టీటీడీ ఈవో సింఘాల్, అర్చకులు వైఎస్ జగన్కు స్వామి వారి శేషవస్త్రంతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు. వైఎస్ జగన్ విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకున్నారు.
ప్రమాణ స్వీకారానికి ముందు స్వామికి ఫోన్ చేసిన జగన్ ఆయన ఆశీస్సులు కోరారు. స్వామి ఆశిస్సులు అందుకున్నారు. విజయవాడలో జగన్ ప్రమాణస్వీకార సమాయానికి వాతావరణంలో కూడా మార్పులు సంభవించడం.. పార్టీ నేతలు రాష్ట్ర భవిష్యత్ ఇక బంగారుమయమని అవుతుందని సంబరపడుతున్నారు. భానుడి భగభగలతో అల్లాడిపోయే విజయవాడలో వరుణుడు కరుణించి వర్షం కురిపించడంతో ఏర్పాట్లకు విఘాతం కలిగినా.. వేడిమి, ఉక్కపోత నుంచి కాసింత ఉపశమనం లభించిందని కార్యకర్తలు పేర్కోంటున్నారు. ఈ కార్యక్రమానికి భారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు తరలిరావడంతో విజయవాడలో పండగ వాతావరణం నెలకొంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more