Cm kiran allots bayyaram 2 other mines to vsp

cm kiran allots bayyaram 2 other mines to vsp, gudur mandal of warangal, vsp gets mining lands, n. kiran kumar reddy

cm kiran allots bayyaram 2 other mines to vsp

విశాఖ ఉక్కుకు తీపీకబురు?

Posted: 04/18/2013 07:37 PM IST
Cm kiran allots bayyaram 2 other mines to vsp

నవరత్న హోదా పరిశ్రమల్లో ఒకటైన విశాఖ ఉక్కు కర్మాగారం ( రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటె-ఆర్ఐఎన్ఎల్) కు మంచి రోజులు రానున్నాయి. ఇంతవరకు సొంత గనులు లేని కారణంగా ఆటు పోట్లు ఎదుర్కొంటున్న పరిశ్రమకు ఆ లోటును రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. నర్సంపేట, గూడూరు అటవీప్రాతాల్లోని ఇనుప ఖనిజాన్ని విశాఖ స్టీల్‌కు అంకితంచేస్తూ ప్రభుత్వం జీవో జారీచేయడంతో ఇక్కడి ఇనుప ఖనిజ అక్రమ రవాణాకు తెరదించినట్లయింది. ఖమ్మంజిల్లా బయ్యారం గనులను ఉన్న గూడూరు మండలంలోని నేలవంచ, కొంగరగిద్ద అటవీ పరిసరాల్లోని 300 హెక్టార్లలో పూర్తిగా ఐరన్ ఓర్ ఖనిజ నిక్షేపాలున్నాయి. వీటితోకలిపి గూడూరు, నర్సంపేట అటవీరేంజ్‌ల పరిధిలోని మొత్తం 2500 హెక్టార్ల భూమిని విశాఖ స్టీల్‌కు ప్రభుత్వం ధారాదత్తం చేసింది. గూడూరు మండలంలో విలువైన ఖనిజ సంపద ఉంది. ఆ ఖనిజ సంపదను 2004 నుంచి 2009 వరకు యథేచ్ఛగా అక్రమ రవాణా సాగించారు. కొన్ని లక్షల టన్నుల ఇనుప ఖనిజాన్ని అక్రమంగా తరలించిన వారి గుట్టు ట్రాక్టర్ బోల్తాతో బాహ్య ప్రపంచానికి తెలిసింది. అప్పటి వరకు గూడూరు ప్రాంతంలో ఇనుప ఖనిజం ఉన్నప్పటికీ దాని విలువ ఈ ప్రాంత ప్రజలకు తెలియకపోవడంతో ఇక్కడి ప్రజలే ఇనుప ఖనిజం గనుల్లో కూలీలుగా పనిచేసి రాశులుగా పోసిన ఇనుప ఖనిజాన్ని లారీల ద్వారా అక్రమంగా తరలించారు. అయితే బయ్యారం గనులతో ముడిపడి ఉన్న గూడూరు ఖనిజాన్ని కూడా లీజ్ ఉందనే భ్రమలోనే రాజకీయపార్టీల నాయకులు, ప్రజలు ఉండేవారు. 2012 జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వం బయ్యారం గనులను రద్దు చేయడంతో అసలు రహస్యం బయటకు వచ్చి గూ డూరు మండలంలోని గనులకు కూడా ఎవరికీ హక్కులేదనేది తేలిపోయింది. గూడూరు రేంజ్ పరిధిలో అత్యధికం గా ఇనుపఖనిజం ఉన్న ప్రాంతాన్ని అధికారులు గుర్తించా రు. వాటిలో అటవీశాఖ కంపార్ట్‌మెంట్ పరిధిలోని 968,69లలో 300 హెక్టార్లు ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఇది కాకుండా మరో రెండువేల హెక్టార్లలో ఇనుప ఖనిజం నిక్షేపాలున్నట్లు మైనింగ్‌శాఖ అంచనావేస్తోంది. నర్సంపేట డివిజన్‌లోని గూడూరు, కొత్తగూడ, ఖానాపురం మండలాల్లో ఇనుప ఖనిజం భారీ ఎత్తున విస్తరించి ఉం ది. వరంగల్ జిల్లాలో చిట్యాల నుంచి మొదలైన ఐరన్ ఓర్ లేయర్ మల్లంపల్లి ద్వారా నర్సంపేట డివిజన్‌లోని నల్లబెల్లి, ఖానాపురం, కొత్తగూడ, గూడూరు మండలాల ద్వా రా బయ్యారానికి విస్తరించింది. అయితే మల్లంపల్లి గనుల కన్నా నర్సంపేట డివిజన్‌లోని గూడూరు, మండలంలో ఉన్న ఐరన్ గనులు విలువైనవే కాకుండా ఎక్కువ నాణ్యత కలిగి ఉంటుందనేది ఆ శాఖాధికారుల నివేదికలు తెలుపుతున్నాయి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Workers strike at visakhapatnam port

    ఏజెన్సీలో చలి పులి- విశాఖ పోర్టులో మోగిన సమ్మె సైరన్

    Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more

  • Minister balaraju fire on t bill

    టి-బిల్లును-దిగ్విజయ్ ను అడ్డుకుంటాం :మంత్రి బాలరాజు

    Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more

  • Student jac egg attacks on purandeswari

    కోడిగుడ్ల దాడి- బాధాకరం- పురంధేశ్వరి

    Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more

  • Lehar cyclone effect to coastal ap

    విశాఖ తీరం వద్ద లెహర్ తీరం దాటే అవకాశం

    Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more

  • Kishore chandra deo wants vizag to be seemandhra capital

    ఆంధ్ర రాజదాని పై కిషోర్ చంద్రదేవ్ పోరాటం

    Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more