ధైర్యానికి, బలానికి ప్రతిరూపంగా భావించే ఆంజనేయుని జయంతి సందర్భంగా తెలుగునాటలో ఘనంగా వేడుకలను నిర్వహించుకున్నారు. అటు ఆంధ్ర, ఇటు తెలంగాణ రాష్ట్రాలలో వున్న ఆంజనేయుని దేవాలయాలు భక్తజనాలతో కిక్కిరిసిపోయాయి. పూజారులు, పండితులు కూడా భక్తిశ్రద్ధలతో ఆంజనేయ స్వామికి అభిషేకాలు కూడా నిర్వహించారు.
రాముని పరమభక్తుడైన హనుమంతుడు.. సీతమ్మ జాడను కనుగొనేందుకు సముద్రాలను దాటి, రావణునికి చిత్రహింసలకు గురిచేసిన పరాక్రమవంతుడైన బలశాలి. అటువంటి హనుమంతుని జయంతి రోజు ఆధ్యాత్మికంగా, భక్తితో పూజలు చేస్తే.. తలపెట్టిన పనులలో, కార్యక్రమాల్లో ఎటువంటి ఆపదలు రావని, ఎంతటి సమస్యనైనా సులువుగా పరిష్కరించుకోవచ్చుని ప్రతిఒక్కరు ప్రగాఢంగా విశ్వసిస్తారు.
సాధారణంగా హనుమాన జయంతిని ప్రతిఒక్కరు చైత్ర పౌర్ణమినాడు ఎంతో ఆధ్యాత్మికంగా నిర్వహించుకుంటారు. అయితే తెలుగునాటలో కొన్ని ప్రాంతాల్లో చైత్ర శుద్ధ పౌర్ణమినాడు, మరికొన్ని ప్రాంతాల్లో వైశాఖ బహుళ దశమినాడు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. అలాగే ఉత్తర భారతంలో కూడా కొన్ని విశేష సందర్భాల్లో ఆంజనేయుని జయంతి వేడుకలు నిర్వహించుకుంటారు. ఇలా ఈ విధంగా మొత్తం మూడుసార్లు హనుమాన్ జయంతిని మన భారతదేశంలో నిర్వహించుకోవడం జరుగుతుంది.
తెలుగునాటలో హనుమాన్ జయంతి విశేషాలు :
ముఖ్యంగా మన తెలుగు ఉమ్మడి రాష్ట్రాల్లో హనుమాన్ జయంతి వేడుకలు ఎంతో భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటారు. హనుమంతుని దేవాలయాలకు వేలాదిమంది భక్తులు హాజరయ్యి, పూజా కార్యక్రమాలను నిర్వహించుకుని, అభిషేకాలు చేయించి, తమ కోరికలను కోరుకుంటారు.
ఆంధ్రరాష్ట్రంలోని కృష్ణాజిల్లాలో హనుమాన్ జంక్షన్ అభయాంజనేయ స్వామి భక్తజనాలతో పోటెత్తింది. ఆలాయాన్ని విశేషపూర్వకంగా అలంకరణ చేశారు. వేదపండితులు మంత్రాలు చదువుతూ స్వామివారికి అభిషేక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ ప్రాంతంలో ఆంజనేయునిని దర్శించుకోవడానికి భక్తులు ఉదయం 3 గంటల నుంచే క్యూ లైన్లో నిలబడి వేచివున్నారు. చివరికి చిన్నపిల్లల సైతం హనుమంతునిని దర్శించుకోవడానికి ఆలయానికి విచ్చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో వున్న హనుమాన్ దేవాలయాల్లో కూడా వేలాదిమంది భక్తులు హాజరయ్యారు. అందులో ముఖ్యంగా ప్రసిద్ధి చెందిన కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు ఎంతో భేషుగ్గా నిర్వహించారు. అలాగే ఖమ్మంలో వున్న ఆంజనేయుని పెద్ద విగ్రహాన్ని కూడా ఎంతో అందంగా అలంకరించి, విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు. నగరంలో ప్రత్యేకంగా తయారుచేసిన ఈ ఆంజనేయ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఇలా ఈ విధంగా మెదక్, నల్గొండ, వరంగల్, నిజామాబాద్ వంటి జిల్లాల్లో కూడా ఆంజనేయుని విగ్రహాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.
(And get your daily news straight to your inbox)
Sep 11 | శాంతించిన రాముడితో లక్ష్మణుడు " అన్నయ్యా! చూశావ లోకం యొక్క పోకడ ఎలా ఉంటుందో. కష్టాలు అనేవి ఒక్కరికే కాదు, గతంలో కూడా కష్టపడినవారు ఎందరో ఉన్నారు. నహుషుని కుమారుడైన యయాతి ఎంత కష్టపడ్డాడో... Read more
Sep 07 | త్వయా ఏవ నూనం దుష్టాత్మన్ భీరుణా హర్తుం ఇచ్ఛతా | మమ అపవాహితో భర్తా మృగ రూపేణ మాయయా || రావణుడి చేత ఎత్తుకుపోబడుతున్న సీతమ్మ ఇలా అనింది " నువ్వు మాయా మృగాన్ని... Read more
Sep 06 | అప్పటిదాకా రథంలో ఉన్న రావణుడు, లక్ష్మణుడు కంటికి కనపడనంత దూరానికి వెళ్ళాక, ఆ రథం నుండి కిందకి దిగి కామరూపాన్ని దాల్చాడు. మృదువైన కాషాయ వస్త్రాలని ధరించి, ఒక పిలక పెట్టుకుని, యజ్ఞోపవీతం వేసుకుని,... Read more
Sep 03 | రావణుడు, మారీచుడు ఇద్దరూ కలిసి రాముడున్న ఆశ్రమం దెగ్గర రథంలో దిగారు. అప్పుడా మారీచుడు ఒక అందమైన జింకగా మారిపోయాడు. దాని ఒళ్ళంతా బంగారు రంగులో ఉంది, దానిమీద ఎక్కడ చూసినా వెండి చుక్కలు... Read more
Aug 27 | అందరూ వెళ్ళిపోయాక రావణుడు నిశ్శబ్ధంగా వాహనశాలకి వెళ్ళి సారధిని పిలిచి ఉత్తమమైన రథాన్ని సిద్ధం చెయ్యమన్నాడు. అప్పుడు రావణుడు బంగారంతో చెయ్యబడ్డ, పిశాచాల వంటి ముఖాలు ఉన్న గాడిదలు కట్టిన రథాన్ని ఎక్కి సముద్ర... Read more